వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత అన్నారు. రైతులతో చెలగాటం ఆడుతున్నారు. ధాన్యం దళారీలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. వరి ఉరి కాదు రైతుల పాలిట సిరి.. రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.
Read Also: బిడ్డ కోసం చిరుతతో పోరాటం.. తల్లి ప్రేమ ముందు తోకముడిచిన క్రూరమృగం..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ఇక, సీఎం కేసీఆర్ రైతుల పాలిట రాబంధులా తయారయ్యారని ఆరోపించిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వ్యవసాయ మంత్రికి ఏ పంట ఎప్పుడు వస్తుందో ఇంగిత జ్ఞానం ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు.. వ్యవసాయం గురించి తెలియని కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై స్పందించిన ప్రభాకర్.. ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.. ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులని టీఆర్ఎస్ నేతలు అతి తక్కువ ధరలకు లీజులకు తీసుకున్నారని ఆరోపించిన ఆయన.. ఆ లీజులను ప్రస్తుత మార్కెట్ ధరలకు పెంచాలని.. ఆర్టీసీ వాడే డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని సూచించారు.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!