Telagnana BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు.. నేడు ఎంపీ అభ్యర్థుల ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telagnana BJP: రాష్ట్రీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు దాదాపు 100 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలు పాల్గొననున్నారు. తొలి జాభితాలోనే తెలంగాణ అభ్యర్థుల ప్రకటించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది అభ్యర్థులకు సీటు దక్కే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కనీసం రెండంకెల సీట్లు సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
Read also: TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
Also Read
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకత్వం విజయయాత్ర ప్రారంభించింది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించే బీజేపీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
తాజావార్తలు
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!