Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రూరల్ టైలర్స్ అసోసియేషన్ వారికి 20 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. యార్లగడ్డ సొంత ఖర్చుతో రూ.2 లక్షల విలువైన 20 కుట్టు మిషన్లను నిరుపేదలకు అందజేసి తన ఉదారస్వభావాన్ని చాటుకున్నారు. ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బొప్పన హరికృష్ణ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో రెడీమెడ్ రంగం విస్తరించడంతో దర్జీలకు డిమాండ్ తగ్గిందన్నారు. దీంతో టైలర్స్ పరిస్థితి దయనీయంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టైలరింగ్ వృత్తిని ప్రోత్సహించి అర్ధాకలితో అలమటిస్తున్న దర్జీలకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సైతం టైలర్లకు మద్దతుగా నిలువాలని కోరారు. రాబోయే టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీను, వి.శ్రీనివాసరావు, ఎనికెపాడు రాజు, ఎనికెపాడు శ్రీనివాసరావు, రూరల్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజాగా.. విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టిన అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం పూర్తైంది. గన్నవరం నియజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ.. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన ఈ యాగం సోమవారం ప్రారంభమై మూడు రోజుల పాటు సాగింది. యార్లగడ్డ వెంకట్రావు, శ్రీమతి జ్ఞానేశ్వరి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!