Telagnana BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు.. నేడు ఎంపీ అభ్యర్థుల ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telagnana BJP: రాష్ట్రీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు దాదాపు 100 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలు పాల్గొననున్నారు. తొలి జాభితాలోనే తెలంగాణ అభ్యర్థుల ప్రకటించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది అభ్యర్థులకు సీటు దక్కే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కనీసం రెండంకెల సీట్లు సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
Read also: TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకత్వం విజయయాత్ర ప్రారంభించింది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించే బీజేపీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!