Telagnana BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు.. నేడు ఎంపీ అభ్యర్థుల ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telagnana BJP: రాష్ట్రీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు దాదాపు 100 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలు పాల్గొననున్నారు. తొలి జాభితాలోనే తెలంగాణ అభ్యర్థుల ప్రకటించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది అభ్యర్థులకు సీటు దక్కే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కనీసం రెండంకెల సీట్లు సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
Read also: TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకత్వం విజయయాత్ర ప్రారంభించింది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించే బీజేపీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!