Shadnagar: పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన.. దొంగల పట్టించిన మేకలు
- మే..మే.. అంటూ దొంగలను పట్టించిన మేకలు
- అపహరణకు గురైన మూగజీవాలు..
- జియాగూడ మార్కెట్లో తమ యజమానిని చూసి అరుపులు
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అపహరణకు గురైన మేకలు దొంగలను పట్టించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇదే నిజం.. మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు పెట్టిన మేకలు.. దొంగలను పట్టించాయి. ఈ ఘటన హైదరాబాద్, పాతబస్తీలోని జియా గూడ మార్కెట్లో జరిగింది. పెద్ది ఎల్కిచర్లలో వెంకటయ్యకు చెందిన 30 మేకలను ఈ నెల 9న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వెంకటయ్య, అతని కుటుంబసభ్యులు ఆ రోజు నుంచి వాటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ సెప్టెంబరు 11న జియాగూడ మేకల మార్కెట్ కు వచ్చాడు. అక్కడ ఓ కంటెయినర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్ ను చూసి అరవడం మొదలు పె ట్టాయి. దీంతో ప్రవీణ్ తమ కోడ్ భాషలో ఆ మేకలను పిలిచాడు. అంతే ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ దగ్గరికి పరుగు తీశాయి. దీంతో ఆ మంద వద్ద ఉన్న వ్యక్తులను ప్రవీణ్ ప్రశ్నించగా.. తాము మేకలను రూ.30 లక్షలకు కొన్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ప్రవీణన్ ను వారు భయపెట్టేందుకు యత్నించారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ప్రవీణ్ ద్వారా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వెంకటయ్య తదితరులు కుల్సుంపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ మేకలతో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాన్ని అంగీకరించారు. నిందితులను, మేకలను శుక్రవారం రాత్రికి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మరో ముగ్గురు తమ ముఠాలో ఉన్నారని ఆ దొంగలు చౌదరిగౌడ పోలీసులకు వెల్లడించారు. దీంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు దొంగలించి దాచిపెట్టిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!