సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని దేశ ప్రజలకు అందేలా చేసిన చినన జీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. సమానత్వం గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం.. రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరవేశారన్నారు. వసుదైక కుటుంబం అని సమాజంలో అంతరాలు లేకుండా సందేశం ఇచ్చారన్నారు. దీనిని విశ్వ వ్యాప్తం చేయడానికి చిన జీయర్ స్వామి గొప్ప ప్రయత్నం చేశారని భట్టి అన్నారు. ప్రతీ మనిషి లో దైవత్వం..మనషులందరూ సమానమేననే సందేహం రామానుజుల వారు ఇచ్చారన్నారు.
Read Also: దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవిస్తాను ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని భట్టి పేర్కొన్నారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక వ్యాసంలో రాశారన్నారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన జీయర్ స్వామిని సందర్శించి కుటుంబానికి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భట్టి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా.. ఇప్పుడే రావడానికి ఒక రీజన్ ఉంది. ఫిబ్రవరిలో మా మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.. అందుకే ముందే వచ్చి వెళ్తున్నాని భట్టి చెప్పారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ విగ్రహం తెలంగాణ ఒక ఐకాన్గా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!