సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని దేశ ప్రజలకు అందేలా చేసిన చినన జీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. సమానత్వం గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం.. రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరవేశారన్నారు. వసుదైక కుటుంబం అని సమాజంలో అంతరాలు లేకుండా సందేశం ఇచ్చారన్నారు. దీనిని విశ్వ వ్యాప్తం చేయడానికి చిన జీయర్ స్వామి గొప్ప ప్రయత్నం చేశారని భట్టి అన్నారు. ప్రతీ మనిషి లో దైవత్వం..మనషులందరూ సమానమేననే సందేహం రామానుజుల వారు ఇచ్చారన్నారు.
Read Also: దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవిస్తాను ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని భట్టి పేర్కొన్నారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక వ్యాసంలో రాశారన్నారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన జీయర్ స్వామిని సందర్శించి కుటుంబానికి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భట్టి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా.. ఇప్పుడే రావడానికి ఒక రీజన్ ఉంది. ఫిబ్రవరిలో మా మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.. అందుకే ముందే వచ్చి వెళ్తున్నాని భట్టి చెప్పారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ విగ్రహం తెలంగాణ ఒక ఐకాన్గా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!