TPCC Mahesh Goud : బండి సంజయ్ బీసీ కాదు.. దేశ్ముఖ్
- బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని టీపీసీసీ ఆరోపణలు
- కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి బయటపడిందని విమర్శ
- రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు లేదన్న మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అసలు బీసీ కాదని, దేశ్ముఖ్ వర్గానికి చెందినవారని విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు.
Trinamool Congress: బీజేపీ నేతల గొంతులో యాసిడ్ పోస్తా.. టీఎంసీ ఎమ్మెల్యే బెదిరింపు..
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
బీసీ రిజర్వేషన్ల విషయమై బీజేపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ప్రధాని మోడీని అడ్డుపెట్టుకుని తాత్కాలికంగా బీసీ రిజర్వేషన్లు నిలిపివేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయం అని, అప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎలా ఆపుతారో చూస్తామని వ్యాఖ్యానించారు. బండి సంజయ్కు సవాల్ విసురుతూ, నిజమైన బీసీ పౌరుషం ఉంటే బీసీ బిల్లును చట్టబద్ధం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
కవితపై కూడా ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. “కవితను జిల్లా కోడలుగా అభిమానిస్తాం, కానీ లిక్కర్ రాణిగా ద్వేషిస్తాం” అని అన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పటానికి కవిత స్వయాన మాటలే నిదర్శనమని విమర్శించారు. కుటుంబ సభ్యులంతా కలిసి దోచుకున్నారని, వాటాల్లో తేడా వల్లే విభేదాలు బయటికొచ్చాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఈ మాటలు చెబితే ఆమెకు సన్మానం చేసేవాళ్లమని అన్నారు. కానీ ఇప్పుడు కవితతో కలిసి కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు లేదని మరోసారి స్పష్టం చేశారు. “ఒక సంవత్సరం క్రితం బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండదని చెప్పాను, ఇప్పుడు అదే జరుగుతోంది” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!