Bandi Sanjay కేసీఆర్ నిర్ణయాలతో రైతులు బికారులు అవుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్రలో.. 31 రోజుల్లో 383km పూర్తి చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విజవంతం చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని అన్నారు. అమిత్ షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీ అటకెక్కిందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. వ్యాట్ ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని అన్నారు. ఫసల్ భీమా యోజన అమలు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ.. కోటీశ్వరుడు అవుతుంటే.. రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారు.
కేసీఆర్ రైతులను అరిగోస పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని బండి సంజయ్ అన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే.. బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే అని స్పష్టం చేశారు. 4 శాతం ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి, SC,ST,OBC రిజర్వేషన్లు అమలు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
నిన్న బహిరంగ సభలో వరుణ దేవుడు కరుణించి, వాన కురిపించాడని సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ పగటి వేషగాళ్ళని ఎద్దేవ చేశారు. గంగిరెద్దులను ఆడించే వారికి విశ్వాసం ఉంటుంది కానీ.. వీళ్లకు అది కూడా ఉండదని మండి పడ్డారు. గంగిరెద్దు వాళ్లపై కూడా కేసీఆర్ ప్రభుత్వం టాక్స్ లు విధిస్తారేమో.. అంటూ ఎద్దేవ చేశారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామని అన్నారు. కేసీఆర్ కు పచ్చ కామెర్ల రోగం ఉందని, తెలంగాణలో ఆకుపచ్చ ని జెండాలను ఎగరనివ్వమని.. బంగాళాఖాతంలో కలిపేస్తామని అదే బీజేపీ లక్ష్యం మని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి కానీ.. శృతి మించి ఉండడం మంచిది కాదని అన్నారు.
కాషాయపు కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నాయకులు
వనస్థలిపురం టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంజన్ గౌడ్ సహా వందలాది మంది టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఎల్బీ నగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ కి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరికాసేపట్లో ఖమ్మం చేరుకొని సాయి గణేష్ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించనున్నారు.
Nizamabad Hospital: ప్రభుత్వాసుపత్రిలో ఖాళీలతో పని వత్తిడి
- Tags
- Anjan Goud
- bandi sanjay
- bjp
- LB Nagar
- TRS
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?