Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారింది
- కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారింది
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి :బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కరీంనగర్లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మోదీ ప్రభుత్వ విధానం క్లియర్ – అవినీతిని తహతహలాడిపోవడం. ఊసరవెల్లిలా స్టాండ్ మారించే పార్టీ కాదు బీజేపీ’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bribe: లంచం తీసుకుని బుక్కయ్యారు.. డబ్బు ఆశతో సస్పెండ్ అయిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్
Also Read
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో నిండి ఉందని, రూ. 38 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 1.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా కేసీఆర్ భారీ మోసం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల అధికారులు, రాజకీయ నాయకులు వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపోతే, కేసీఆర్ తనను తాను ఇంజినీర్, డాక్టర్ అంటూ ప్రాజెక్టును సమర్థించుకున్నా, విచారణకు వచ్చినప్పుడు కేబినెట్లో చర్చించి తీసుకున్న నిర్ణయం అని తప్పించుకోవడం చూస్తే బతకడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
‘‘రాహుల్ గాంధీ గతంలో కాళేశ్వరం పై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకుని, బీజేపీకి అధికారం అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు.
Anaswara : స్పీడు మీదున్న హీరోయిన్.. ఏకంగా 5 సినిమాలు రిలీజ్
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!