Bandi Sanjay: రేవంత్ రెడ్డి లా పార్టీలు మారడం నాకు చేతకాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Chitchat: రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని, కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో అంటూ వ్యాగాస్త్రం వేశారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తామన్నారు. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారని అన్నారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోందని తెలిపారు. మా దగ్గర సీనియర్లు బాస్ లు.. అదే కాంగ్రెస్ లో హోంగార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీకి ఎందుకు క్యాండిడేట్లు దొరుకుకట్లేదు? అంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం నాకు చేతకాదని ఎద్దేవ చేశారు. బీజేపీ పార్టీ ఎక్కడుందో వాళ్ల అయ్యను కేటీఆర్ అడగాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Beer Sales: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు.. సమ్మర్ ఎఫెక్ట్తో ఊపందుకున్న సేల్స్
Also Read
బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాధానం చెప్పారని అన్నారు. మాది కుటుంబ పార్టీ కాదు.. అయ్య పేరు చెప్పి కూతురు కొడుకు సీఎంలు అయ్యే పార్టీ మాది కాదన్నారు. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ మాది కాదని బండి సంజయ్ అన్నారు. ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు అని, దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కోరారు. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని అన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్ కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలని సవాల్ విసిరారు. ఆర్నెళ్లలో మేము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామన్నారు. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని తెలిపారు. క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారని బండి సంజయ్ అన్నారు.
Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!