Bandi Sanjay: మోడీ తెలంగాణ పర్యటన.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay On PM Modi Telangana Tour: ప్రధాని మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడం.. ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నెల 12న ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను మోడీ ప్రారంభించి, జాతికి అంకితం చేస్తామన్నారు. ప్రధాని అయిన తర్వాత మోడీ వ్యవసాయ రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారని, ఫలితంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఒక యూరియా బస్తాకు కేంద్రం రూ.3,500 సబ్సిడీ ఇచ్చి.. రూ. 200లకే రైతులకు అందిస్తోందన్నారు. కేవలం రామగుండం ఎరువుల కర్మాగారమే కాకుండా.. మూడు జాతీయ రహదారులను కూడా మోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. రైతులందరూ మోడీ పర్యటనను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. 75 అసెంబ్లీ నియోజకవర్గల్లో ఎల్సీడీ (LCD) స్క్రీన్స్ పెట్టనున్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కేంద్ర ఎరువులు, రసాయనిక శాఖ సహాయమంత్రి భగవంత్ ఖూభా మాట్లాడుతూ.. దేశంలో మూతపడిన ఐదు యూరియా యూనిట్లను తెరిపించిన ఘనత ప్రధాని మోడీదేనని పేర్కొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఏడాదికి 12.8 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోందని అన్నారు. రైతులకు యూరియా అందించడమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. 12న రామగుండంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు.. 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులతో ‘రైతే రాజు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రైతులతో కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించి.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ఎరువుల కర్మాగారం నిర్మించిందని, దాన్ని జాతికి అంకితం చేసేందుకు మోడీ రాష్ట్రానికి వస్తున్నారని రైతులకు తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులపై ప్రజలకు తెలియజేసేలా 11న తేదీన విలేకరుల సమావేశాన్ని కూడా బీజేపీ నేతలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..