Bandi Sanjay: మోడీ లేకపోతే.. భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం..
Bandi Sanjay: మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ బీజేపీ మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నయ్ అన్నారు.
Read also: Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారు..
Also Read
నేను…. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా.. (మేమిద్దరం..మాకిద్దరనే కుటుంబ నియంత్రణ విధానానికి ఓటేస్తం) అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం…40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం) అవుతుందన్నారు. కేసీఆర్ దేశద్రోహి…ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు? అని మండిపడ్డారు.
Read also: KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్ ను బొక్కలో వేసే వాళ్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నాడన్నారు. రేవంతన్నా… సరిహద్దుకు తీసుకుపోతా రా… సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరని సవాల్ విసిరారు. మోడీ లేని భారత్ ను ఊహించుకోలేమని.. హీరో అని నువ్వే మోడీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న అంటూ గుర్తు చేశారు.
Read also: Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
సౌతిండియన్లు, ఆఫ్రికన్లలాగా ఉంటామని (శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో 60 శాతం వాటాను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపేయండి అన్నారు. నన్ను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్ అన్నారు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడన్నారు. హిందూ బంధువులారా… కరీంనగర్ కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో ఏబీసీ చూపించండి అన్నారు.
Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో