Bandi Sanjay: మోడీ లేకపోతే.. భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ బీజేపీ మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నయ్ అన్నారు.
Read also: Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారు..
Also Read
నేను…. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా.. (మేమిద్దరం..మాకిద్దరనే కుటుంబ నియంత్రణ విధానానికి ఓటేస్తం) అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం…40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం) అవుతుందన్నారు. కేసీఆర్ దేశద్రోహి…ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు? అని మండిపడ్డారు.
Read also: KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్ ను బొక్కలో వేసే వాళ్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నాడన్నారు. రేవంతన్నా… సరిహద్దుకు తీసుకుపోతా రా… సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరని సవాల్ విసిరారు. మోడీ లేని భారత్ ను ఊహించుకోలేమని.. హీరో అని నువ్వే మోడీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న అంటూ గుర్తు చేశారు.
Read also: Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
సౌతిండియన్లు, ఆఫ్రికన్లలాగా ఉంటామని (శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో 60 శాతం వాటాను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపేయండి అన్నారు. నన్ను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్ అన్నారు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడన్నారు. హిందూ బంధువులారా… కరీంనగర్ కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో ఏబీసీ చూపించండి అన్నారు.
Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!