Amnesia Pub Case: మనుషులా.? రాక్షసులా.?.. బండి సంజయ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్ కేసును పోలీసులు కావాలనే నీరుగారుస్తున్నారని.. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మే 28న ఫిర్యాదు అందితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. మూడు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులపై ప్రెజర్ ఉందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమ్నేషియా పబ్, అమ్మాయి అత్యాచారం కేసుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీరు మనుషులా.? రాక్షసులా.? మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా.? అంటూ ప్రశ్నించారు. 5 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసు నీరుగారుస్తారా.? చంచల్ గూడ జైల్లో ఉండాల్సినోళ్లను సేఫ్ ప్లేస్ లో పెడతారా.? అంటూ ప్రశ్నించారు. హత్యలు, అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం ఫిడేల్ వాయిస్తున్నారా.? అంటూ మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతోందని విమర్శించారు.
Also Read
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరని హెచ్చరించారు. అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఓవైసీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదని.. చెప్పకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. నిందితులను గుర్తించలేదని విధంగా ఉన్న సీసీ కెమెరాలతో ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!