Bandi Sanjay: కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కోరాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి భవన్ లోనే ఉంటారని విమర్శలు గుప్పించారు.
డ్రగ్స్ కేసులో కూడా ఇంత వరకు పోలీసులు సాధించిందేం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార కేసులో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు…సీఎం చేతకాని తనం అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ క్రిమినల్స్ కు అడ్డాగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ప్రమేయం లేకపోతే సీఎం కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని అన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
క్రిమినల్స్ ను కఠినంగా శిక్షించాలి తప్పితే పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుపై కాలయాపన ఎందుకు చేశారని.. నిందితులను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. అమ్మాయి తనపై ఎవరు అత్యాచారం చేశారో చెప్పిందని.. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాన్ని ఒప్పించో, తప్పించో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమైన నాయకుల కుటుంబ సభ్యులను కేసు నుంచి తప్పించాలని.. వేరే పేర్లను పెట్టాలని సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ఇదే విధంగా అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!