Bandi Sanjay: బండి సంజయ్ నారాజ్..! ఢిల్లీ పెద్దల వద్ద ఆవేదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కొత్త జోష్ నింపారని చెబుతారు.. ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించిన తర్వాత తెలంగాణలోని లీడర్లలో, క్యాడర్లో ఉత్సాహం నింపారని.. దూకుడుగా కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తూ.. అధిష్టానం నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.. ఆ మధ్య తుక్కుగూడ దగ్గర నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. బండిపై ప్రశంసలు కురిపించారు.. బండి సంజయ్ మాటలు వింటుంటే.. కేసీఆర్ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరంలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో, బండిపై ఆయనకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే, తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
Read Also: Traffic Rules: మంత్రి, ఎమ్మెల్యే అయితే మాకేంటి..? రూల్ రూలే..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారట బండి సంజయ్.. పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే తనపై వ్యక్తిగత దాడికి పార్టీ నేతలే సహకరిస్తున్నారని బండి సంజయ్ నారాజ్ లో ఉన్నారని సమాచారం.. పార్టీలో జరుగుతోన్న కీలక పరిణామాలపై లీక్లు, సోషల్ మీడియాలో ప్రచారాలపై ఢిల్లీ నాయకుల వద్ద ప్రస్తావించారట తెలంగాణ బీజేపీ చీఫ్.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దల వద్ద ఏ కరువు పెట్టిన ఆయన.. పార్టీలో చేరికలపై జరగుతున్న ప్రచారం, చేరికల అడ్డగింతపై కూడా ఢిల్లీ నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. కాగా, బండి సంజయ్పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు విడిగా సమావేశాలు కావడం అప్పట్లో హాట్ టిపిక్గా మారిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ పెంచారు.. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో తన ఆవేదనను ఢిల్లీ పెద్దల దగ్గర బండి సంజయ్ వెలిబుచ్చడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!