Bandi Sanjay: రాష్ట్రంలో రాక్షస, నయా నిజాం పాలన కొనసాగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని.. బీజేపీ ఒత్తడితోనే విద్యాశాఖలో తెచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని వెల్లడించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కేసీఆర్ ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చి నెలకు రూ. 15 లక్షల జీతం ఇస్తున్నారని.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక దరిద్రపు స్ట్రాటజీ టీమ్ ను పెట్టుకుని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని..టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల తిరస్కరణకు గురైందన్నారు. మాఫియాకు అడ్డాగా హైదరాబాద్ మారడంతో రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే భయపడాల్సి వస్తోందని.. మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు బండి సంజయ్.
సీఎం కళ్లు మూసుకుని ఉన్నారని.. దీంతో సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ బేరీజు వేసుకోవాలని సూచించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని.. మోదీకి మంచి పేరు రాకుండా ఉండేందుకు కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పాలన కోసం బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని కోరారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో తీసేసిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రైవేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రైవేట్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!