Bandi Sanjay: రాష్ట్రంలో రాక్షస, నయా నిజాం పాలన కొనసాగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని.. బీజేపీ ఒత్తడితోనే విద్యాశాఖలో తెచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని వెల్లడించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కేసీఆర్ ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చి నెలకు రూ. 15 లక్షల జీతం ఇస్తున్నారని.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక దరిద్రపు స్ట్రాటజీ టీమ్ ను పెట్టుకుని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని..టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల తిరస్కరణకు గురైందన్నారు. మాఫియాకు అడ్డాగా హైదరాబాద్ మారడంతో రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే భయపడాల్సి వస్తోందని.. మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు బండి సంజయ్.
సీఎం కళ్లు మూసుకుని ఉన్నారని.. దీంతో సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ బేరీజు వేసుకోవాలని సూచించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని.. మోదీకి మంచి పేరు రాకుండా ఉండేందుకు కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పాలన కోసం బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని కోరారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో తీసేసిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రైవేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రైవేట్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!