Bandi Sanjay: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీదే అధికారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని.. ప్రజా సంగ్రామ యాత్రపై దేశం మొత్తం చర్చ జరగిందని ఆయన అన్నారు. అధికారంలోకి బీజేపీ రాబోతోందని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీని త్వరలో రాష్ట్రానికి ఆహ్వనించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తరువాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి… ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తాం అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందని ఆరోపించారు. కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేటీఆర్ ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు.
Also Read
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
మా రాజకీయ భవిష్యత్తు ఏమిటని అధికార పార్టీ నేతలకు టెన్షన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ భాష చూసి అన్ని వర్గాలు తలదించుకుంటున్నాయిన విమర్శించారు. కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తో కుటుంబ పాలన అంతం కాబోతోందని…తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. శ్రీలంక కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలైందని.. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా కుటుంబ పాలన వల్ల హీనంగా తయారైందని విమర్శించారు. త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణపై బీజేపీ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వరసగా బీజేపీ పెద్ద నేతలు తెలంగాణకు వస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు