Bandi Sanjay: కామారెడ్డిలో టెన్షన్.. బండి సంజయ్ అరెస్ట్, పోలీసు వాహనం ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. సీఎం కేసీఆర్ వచ్చేవరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కదిలేదిలేదని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.. దీంతో, బండి సంజయ్, కొందరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, బండి సంజయ్ను పోలీస్ వాహనంలో ఎక్కించి పీఎస్కు తరలించే ప్రయత్నం చేయగా.. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు కార్యకర్తలు.. పోలీస్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. పోలీస్ వాహనంపై దాడి , కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన ఘటనలో మరికొందరు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..
Read Also: MLC Kavitha: కేసీఆర్ గన్ అయితే.. ఉద్యోగులు బుల్లెట్లు..
Also Read
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
- Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
అయితే, అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులతో తోపులాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగి ఉద్రిక్తతంగా మారింది.. కలెక్టరేట్ ముందు ఉన్న బారికేట్లు తోసేసి కార్యాలయం గేట్లు ఎక్కేందుకు యత్నించారు.. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కాగా, సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమంలో పాల్గొంటాం అన్నారు.. రైతు రాములు ఆత్మహత్య తెలంగాణ రైతాంగాన్ని కలిచి వేసింది.. అడ్లూరి రైతు రాములుది పేద కుటుంబం, రెండు ఎకరాలు ఇండస్ట్రీ జోన్ లో పోతుందని బాధపడ్డాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ కు బీజేపీ గాని, కామారెడ్డి ప్రజలు గాని వ్యతిరేకం కాదు.. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఇక, అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు బండి సంజయ్.. రైతులను కలిసి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Jamun-El Niño: విరగకాసిన ‘‘నేరేడు పండ్లు’’, ఈ ఏడాది వర్షాలు అనుమానమే.. అసలేంటీ ఈ సంబంధం..
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
-
Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!