Telangana Bandh: నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్.. కారణం ఇదీ..!
- నిరుద్యోగుల సమస్యలపై పోరాటం..
- నేడు తెలంగాణలో బంద్ కు నిరుద్యోగ సంఘ నేతలు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Bandh: నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీని కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ వారం రోజులుగా నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా.. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇస్తారో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
అయితే, నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కు రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ జేఏసీ, యువజన నాయకులు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్తో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు మోతీలాల్ను కలిసేందుకు వచ్చిన నాయకులు రియాజ్, మానవతారాయ్, చెరగొండ వెంకటేష్, చంగాని దయాకర్, బాల లక్ష్మి, నిజాన రమేష్ తదితరులను నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరుద్యోగులను శాంతింపజేసి నాయకులను లోపలికి పంపించారు. నిరుద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డిని తక్షణమే చర్చలకు పిలవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. సీఎంతో చర్చించేందుకు ప్రయత్నిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం రేవంత్ చర్చకు పిలుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
ఇవీ డిమాండ్లు..
* గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్లాగ్లో ఉంచకూడదు
* నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!