కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయి: బండి సంజయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు నిజమయ్యాయని ఆయన అన్నా రు. తుఫాన్ వస్తుంది, వర్షాలు రాబోతున్నాయి, వడ్లు తడు స్తాయి, రైతులు నష్టపోతారు, నట్టేట మునుగుతారు కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కొని, గోడౌన్ లకు తరలిం చాలని నేను విజ్ఞప్తి చేస్తే రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారా..? ఈరోజు తెలం గాణలోని ఉన్న రైతులు నిండా మునిగి, టవర్ లు ఎక్కి ఆత్మహత్య లు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే దీనికి బాధ్యత పూర్తిగా కేసీఆర్ ది కాదా..? అంటూ ప్రశ్నించారు.
ఈరోజు ఉదయం సిరిసిల్లలో కూడా రైతులు టవర్లెక్కి నిరసన చెబుతుంటే వాళ్లపై కూడా మీ కార్యకర్తలతో రాళ్లు వేయిస్తారా..? కట్టెలతో దాడి చేయిస్తారా..? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వడ్లను కొనడాన్ని వేగవంతం చేయాలని, రైతులను ఆదుకోవాలని, అక్కడ రైతులకు తాలు, తరుగు పేరుతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలని, వారికి న్యాయం చేయాలని నేను పర్యటన చేస్తుంటే అడుగడుగునా టీఆర్ఎ స్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది సమంజసమేనా అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చ గొట్టారు. ఈరోజు ఏ మెహం పెట్టుకొని రైతుల ముందుకు వస్తారు.? మేం గత వారం రోజులుగా వానాకాలం పంటను కొనాలని డిమాండ్ చేస్తుంటే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వచ్చే యాసంగిలో వడ్లు కొంటారా, లేదా అని ధర్నాలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ధర్నాగా నిర్వహించారు. ఈ ధర్నాకు పోలీస్ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసింది. ఈ ధర్నా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సాధించిందా అంటే అది శూన్యమన్నారు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
ఇప్పటికైనా చెప్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ కొనదు. దొడ్డు బియ్యాన్ని కొంటుంది. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చెప్తు న్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పారాబాయిల్డ్ రైస్ కేంద్రం కొంటే నేను ఈ రాష్ట్రం నుంచి కూడా కొనిపిస్తా, లేకుంటే నువ్వు మొత్తం ధాన్యాన్ని రారైస్ గా కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అంటూ సవాల్ విసిరారరు. ఇంకా రెండు రోజుల వరకు వర్షాలు కురి సే అవకాశం ఉంది. రెండు, మూడు రోజులైతే మొలకలు కూడా వస్తా యి. రైతులకు కలిగిన ఈ నష్టానికి సీఎం కేసీఆరే బాధ్యత వహిం చాలన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని, తేమ అంశం లేకుండానే కళ్లాల నుంచి ఎత్తాలన్నారు. మొత్తం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో రైతులతో రాళ్లు వేయించుకునే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి, ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.
- Tags
- bandi sanjay
- bjp
- Farmers
- kcr
- rains
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?