Atrocious Incident: కారుణ్య ఉద్యోగం కోసం దారుణం.. మామను ట్రాక్టర్తో గుద్ది చంపిన అల్లుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు… సింగరేణిలో ఉద్యోగం కోసం మామను ట్రాక్టర్ తో గుద్ది చంపేశాడు అల్లుడు.. భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కారుణ్య ఉద్యోగం కోసం దారుణాని ఒడిగట్టాడు అల్లుడు… మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన ఘోర ఘటన జిల్లాలోని గణపురం మండలంలో చోటు చేసుకుంది. గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు వద్ద బైక్ పై వస్తున్న మామను.. అల్లుడు ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మామ బండారి ఓదెలు అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also: Munugode Bypoll: మునుగోడు సర్వేలన్నీ బీజేపీకే అనుకూలం..!
Also Read
అసలు ఉద్యోగం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏముందనే వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదెలు సింగరేణి ఉద్యోగి. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగురు కూతుళ్లు. చిన్న భార్యకు కూతురు, కుమారుడు ఉన్నాడు… అయితే, ఆయన త్వరలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చిన్న భార్య కొడుక్కు ఉద్యోగం ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కానీ, ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పెద్ద భార్య రెండో కూతురు భర్త నక్క రమేష్.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఇవాళ సాయంత్రం గుండ్లవాగు వద్ద బైక్పై వెళ్తున్న మామాను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేశాడు. అనంతరం ఆయనే నేరుగా గణపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!