Munugode Bypoll: మునుగోడు సర్వేలన్నీ బీజేపీకే అనుకూలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. మునుగోడులో విజయం మాదేఅంటుంది భారతీయ జనతా పార్టీ.. గత ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే.. మునుగోడులోనూ బీజేపీ జెండా పాతేస్తాం అంటున్నారు.. ఇక, మునుగోడులో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: TSPSC Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఇంటెలిజెన్స్ రిపోర్టులూ, కేసీఆర్ సొంత సర్వేలూ కూడా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని చెబుతున్నాయన్నారు బండి సంజయ్.. టీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు నాయకులు భయపడుతున్నారన్న ఆయన.. స్థానిక నేతలను నమ్మకుండా సొంత మనుషులను ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు పంపిణీకి దింపారని ఆరోపించారు.. గెలుపుపై అపనమ్మకంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలకు.. ప్రగతి భవన్ కేంద్రంగా డబ్బు సంచులు పంపిణీ చేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు.. అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్మలాటలతో టీఆర్ఎస్ నేతలు సతమతం అవుతున్నారని విమర్శించారు.. బీజేపీని ఓడించేందుకు గుంట నక్క పార్టీలన్నీ ఏకమైయ్యాయని విమర్శించిన ఆయన.. తోక పార్టీలను పట్టుకుని మునుగోడును ఈదే దుస్థితికి కేసీఆర్ వచ్చారని ఎద్దేవా చేశారు.. ఉమ్మడి జిల్లా నేతలంతా మునుగోడుకు తరలివెళ్లండి.. బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేయండి.. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించబోతోంది.. గుంట నక్క పార్టీల కుట్రలు వివరించి ప్రజలను చైతన్యపర్చండి అంటూ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్ కుమార్.
- Tags
- Bandi Sanjay Kumar
- bjp
- congress
- cpi
- CPM
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!