Ash Mafia: బూడిద మాఫియా.. కోట్లుకొట్టేస్తున్న అక్రమార్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700 ఎకరాలలోయాజమాన్యం పెద్ద యాష్ పాండ్ ఏర్పాటుచేసింది. గతంలో ఈబూడిదను ఎవరూ వినియోగించేవారు కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం రూపాయికి టన్ను చొప్పున తీసుకవెళ్లండి అని చెప్పినా ఎవరూ ముందుకురాలేదు.
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో పాటు కేంద్రప్రభుత్వం బూడిదను ప్రోత్సహించటంతో గతఅయిదు సంవత్సరాలుగా బూడిదకు డిమాండ్ ఏర్పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేసిన తర్వాత గులాయిలలోఇసుకను నింపేవారు.రానురాను ఇసుక కొరత ఏర్పడటంతో సింగరేణిలో కూడా బూడిద వినియోగం బాగా పెరిగింది.బొగ్గుతీసిన తర్వాత గులాయిలలో ఇసుకకు బదులు బూడిదను నింపుతున్నారు.
జాతీయ రహదారుల నిర్మాణానికి మట్టికి బదులుగా బూడిద వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మంచిర్యాల-నాగపూర్, వికారాబాద్,సంగారెడ్డి, సూర్యాపేట జాతీయ రహదారుల నిర్మాణానికి సిమెంటు పరిశ్రమలు, ఇటుకబట్టిలు, ఇంటినిర్మాణాల కోసం బూడిదను వాడుతుండటంతో ఎన్టీపీసీ యాజమాన్యం ఈ బూడిదకు వేలంపాటను పెట్టింది. మొదట పది రూపాయలకు ఆక్షన్ పెట్టింది. క్రమక్రమంగా పోటీ పెరగడంతో యాజమాన్యం గత ఏడాది నవంబర్లో వేలంపాట నిర్వహించింది. పోటాపోటీగా కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఆరులక్షల 50 వేలక్యూబిక్ మీటర్లకు ఓకాంట్రాక్టర్ టన్నుకు 410 రూపాయలు ఎన్టీపీసీ యాజమాన్యంకు చెల్లించే విధంగా టెండర్ దక్కించుకున్నాడు. ఏటా రామగుండంకు నాలుగు కోట్లరూపాయలు బూడిదపై ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
అసలు కథ అప్పుడే మొదలైంది. రామగుండంలో ముఖ్యప్రజాప్రతినిధికి బూడిద మీద కన్నుపడింది.తన అనుచరులను రంగంలోకిదింపి టెండర్ వేసిన వ్యక్తిని బూడిద తరలించకుండా అడ్డుకొని రాత్రివేళలలో అక్రమంగా ఈమాఫియా బూడిదను తరలింపునకు శ్రీకారం చుట్టారు.టెండర్ వేసిన వ్యక్తికిచెందిన జేసీబీలతో అర్థరాత్రి లారీకి 20 వేలరూపాయల చొప్పున వసూళ్లు మొదలుపెట్టారు. ఇలారోజుకు వందల లారీల బూడిదను తరలించుకపోతున్నా ఎన్టీపీసీ ఆదాయంకు గండికొడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ బూడిద అక్రమరవాణాకు తెరలేపారు కొందరు కేటుగాళ్ళు. రోజుకు 20 నుండి 30 లక్షలరూపాయల ఎన్టీపీసీ బూడిదను మాఫియా దోచుకుంటుంది.
రామగుండంకి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి,అతని అనుచరులు ఓ గ్రూపుగా ఏర్పడి రాత్రివేళల్లో బూడిదను,ఇసుకను,అంతర్గాం,గోలివాడ,ఇసుక క్వారీనుండి వందలాది కాంట్రాక్టర్లు ఇసుకను దోచుకుపోతున్నారు. ప్రభుత్వం శాండ్ బుకింగ్ పెట్టి వినియోగదారులకు విక్రయిస్తుండగా, వాటికి మాఫియా గండికొట్టి దర్జాగా దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో ఓప్రజాప్రతినిధిపై రామగుండంలో యాష్, ఇసుకదోపిడీలో ఉన్నట్లు రాజకీయపార్టీలు విమర్శలు చేస్తున్నారు. కుందనపల్లి యాష్ పాండ్లో స్థానికప్రజాప్రతినిధి అనుచరులు మాఫియా ముఠాగా ఏర్పడి,రాత్రి రాత్రికి వందలాది లారీల యాష్ ను దోచుకుతిన్నారని, ఇందులో అధికారుల పాత్రఉందని దీనిపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూడిదచెరువులో ఇటీవల పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీపీసీ ఆదాయానికి గండికొడుతున్న బూడిద మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!