Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ash Mafia Hulchul In Ramagundam Ntpc Area

Ash Mafia: బూడిద మాఫియా.. కోట్లుకొట్టేస్తున్న అక్రమార్కులు

Published Date :March 26, 2022 , 6:28 pm
By NTV WebDesk
Ash Mafia: బూడిద మాఫియా.. కోట్లుకొట్టేస్తున్న అక్రమార్కులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700 ఎకరాలలోయాజమాన్యం పెద్ద యాష్ పాండ్ ఏర్పాటుచేసింది. గతంలో ఈబూడిదను ఎవరూ వినియోగించేవారు కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం రూపాయికి టన్ను చొప్పున తీసుకవెళ్లండి అని చెప్పినా ఎవరూ ముందుకురాలేదు.

రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో పాటు కేంద్రప్రభుత్వం బూడిదను ప్రోత్సహించటంతో గతఅయిదు సంవత్సరాలుగా బూడిదకు డిమాండ్ ఏర్పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేసిన తర్వాత గులాయిలలోఇసుకను నింపేవారు.రానురాను ఇసుక కొరత ఏర్పడటంతో సింగరేణిలో కూడా బూడిద వినియోగం బాగా పెరిగింది.బొగ్గుతీసిన తర్వాత గులాయిలలో ఇసుకకు బదులు బూడిదను నింపుతున్నారు.

జాతీయ రహదారుల నిర్మాణానికి మట్టికి బదులుగా బూడిద వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మంచిర్యాల-నాగపూర్, వికారాబాద్,సంగారెడ్డి, సూర్యాపేట జాతీయ రహదారుల నిర్మాణానికి సిమెంటు పరిశ్రమలు, ఇటుకబట్టిలు, ఇంటినిర్మాణాల కోసం బూడిదను వాడుతుండటంతో ఎన్టీపీసీ యాజమాన్యం ఈ బూడిదకు వేలంపాటను పెట్టింది. మొదట పది రూపాయలకు ఆక్షన్ పెట్టింది. క్రమక్రమంగా పోటీ పెరగడంతో యాజమాన్యం గత ఏడాది నవంబర్లో వేలంపాట నిర్వహించింది. పోటాపోటీగా కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఆరులక్షల 50 వేలక్యూబిక్ మీటర్లకు ఓకాంట్రాక్టర్ టన్నుకు 410 రూపాయలు ఎన్టీపీసీ యాజమాన్యంకు చెల్లించే విధంగా టెండర్ దక్కించుకున్నాడు. ఏటా రామగుండంకు నాలుగు కోట్లరూపాయలు బూడిదపై ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

అసలు కథ అప్పుడే మొదలైంది. రామగుండంలో ముఖ్యప్రజాప్రతినిధికి బూడిద మీద కన్నుపడింది.తన అనుచరులను రంగంలోకిదింపి టెండర్ వేసిన వ్యక్తిని బూడిద తరలించకుండా అడ్డుకొని రాత్రివేళలలో అక్రమంగా ఈమాఫియా బూడిదను తరలింపునకు శ్రీకారం చుట్టారు.టెండర్ వేసిన వ్యక్తికిచెందిన జేసీబీలతో అర్థరాత్రి లారీకి 20 వేలరూపాయల చొప్పున వసూళ్లు మొదలుపెట్టారు. ఇలారోజుకు వందల లారీల బూడిదను తరలించుకపోతున్నా ఎన్టీపీసీ ఆదాయంకు గండికొడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ బూడిద అక్రమరవాణాకు తెరలేపారు కొందరు కేటుగాళ్ళు. రోజుకు 20 నుండి 30 లక్షలరూపాయల ఎన్టీపీసీ బూడిదను మాఫియా దోచుకుంటుంది.

రామగుండంకి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి,అతని అనుచరులు ఓ గ్రూపుగా ఏర్పడి రాత్రివేళల్లో బూడిదను,ఇసుకను,అంతర్గాం,గోలివాడ,ఇసుక క్వారీనుండి వందలాది కాంట్రాక్టర్లు ఇసుకను దోచుకుపోతున్నారు. ప్రభుత్వం శాండ్ బుకింగ్ పెట్టి వినియోగదారులకు విక్రయిస్తుండగా, వాటికి మాఫియా గండికొట్టి దర్జాగా దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో ఓప్రజాప్రతినిధిపై రామగుండంలో యాష్, ఇసుకదోపిడీలో ఉన్నట్లు రాజకీయపార్టీలు విమర్శలు చేస్తున్నారు. కుందనపల్లి యాష్ పాండ్లో స్థానికప్రజాప్రతినిధి అనుచరులు మాఫియా ముఠాగా ఏర్పడి,రాత్రి రాత్రికి వందలాది లారీల యాష్ ను దోచుకుతిన్నారని, ఇందులో అధికారుల పాత్రఉందని దీనిపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూడిదచెరువులో ఇటీవల పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీపీసీ ఆదాయానికి గండికొడుతున్న బూడిద మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://ntvtelugu.com/online-frauds-increase-in-telugu-states/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ash auctions
  • ash mafia
  • Auction
  • construction
  • LORRYS

తాజావార్తలు

  • Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

  • Biker: శర్వా ‘బైకర్’ జోరు.. తొలి వీకెండ్ లోనే రూ. 18 కోట్ల వసూళ్లు!

  • Paytm New Feature: పేటియం అదిరిపోయే అప్‌డేట్.. కార్డ్ లేకుండానే డబ్బులు! ఎలాగో చూసేయండి..

  • Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్

  • Big Alert: హైదరాబాద్‌ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions