Asaduddin Owaisi: మోడీ డిగ్రీ పట్టాకోసం తాజ్మహల్ కింద వెతుకుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ.. తాజ్ మహల్ కింద డిగ్రీ పట్టాకోసం వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవ చేశారు. భారత దేశానికి మొఘలులు వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాళ్లు పుట్టుకొచ్చారని చురకలంటించారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమని, అందులో మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెళికి తీయాలని బీజేపీకి చెందిన ఓ నాయకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ విషయాన్ని చరిత్రకారులకే వదిలేద్దామని.. అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచింది. మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్.. తాజ్మహల్ వివాదంపై మాట్లాడుతూ అక్కడ మోదీ డిగ్రీ పట్టా ఏమైనా దొరుకుతుందేమో వాళ్లు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
మొఘలులు భారత్కు వలస వచ్చారని అంటారు. కానీ చాలా మతాల వారు ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. ‘భారత దేశం నాది కాదు, థాక్రేది కాదు. మోదీ-షాలది అంతకంటే కాదు. ఒకవేళ అది ఎవరికైనా చెందుతుందంటే ద్రవిడియన్లు, ఆదివాసీలకు మాత్రమే.
ఎందుకంటే వారుమాత్రమే ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, పశ్చిమాసియా నుంచి ప్రజలు వలస వచ్చిన తర్వాతే భారత దేశంగా ఏర్పడింది. మొఘలలు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయి’ అని అసదుద్దీన్ చెప్పారు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..