Aadi Srinivas : సీఎం రేవంత్ స్పీచ్కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది ..
- రేవంత్ ప్రసంగంతో బీఆర్ఎస్లో కలకలం
- కేటీఆర్పై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
- కేసీఆర్ క్షేమం కోరుకున్నది కాంగ్రెస్నేనంటూ స్పష్టం
- పదేళ్ల బీఆర్ఎస్ పాలన ‘సర్వంస్వాహా’ అంటూ విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, అవినీతిని ముఖ్యమంత్రి ఎండగట్టడంతో కేటీఆర్, హరీష్ రావులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిని ఉరి తీయాలని అనడం కేటీఆర్ నీచ మనస్తత్వానికి, విశ్వాసఘాతకానికి నిదర్శనం. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం నీది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిని ఉరి తీసినా తప్పులేదని రేవంత్ రెడ్డి అన్నది కేవలం అవినీతి తీవ్రతను చెప్పడానికే తప్ప, ఎవరి చావును కోరుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
Pakistan: పాకిస్తాన్ను కుదిపేస్తున్న కొత్త సంక్షోభం..
కేసీఆర్ చావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదని, కేసీఆర్ కాలు విరిగినప్పుడు స్వయంగా వెళ్లి పరామర్సించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. మానవత్వం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ‘సర్వభ్రష్ట ప్రభుత్వం’ అని కేటీఆర్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. “మీది పదేళ్ల పాటు సాగిన ‘సర్వస్వాహా’ ప్రభుత్వం. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపారు. కేటీఆర్ తన అసహనాన్ని తగ్గించుకుని, మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే ప్రజలు నీకు మతి తప్పిందని భావిస్తారు” అని హెచ్చరించారు. తెలంగాణ ఛాంపియన్లుగా చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబం, అసెంబ్లీలో వారి అవినీతి చరిత్ర బయటపడటంతో ఆగం ఆగం అవుతున్నారని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
LIC Jeevan Tarun Policy: LIC సూపర్ ప్లాన్ చూశారా! కేవలం రూ.150 ఆదా చేస్తే రూ.26 లక్షలు..
తాజావార్తలు
-
Shiva Rajkumar: రామ్చరణ్కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?