Aadi Srinivas: ఏం జరిగినా విమర్శించడం బీఆర్ఎస్కు అలవాటైపోయింది
- బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన ఆది శ్రీనివాస్
- ఏం జరిగినా విమర్శించడం బీఆర్ఎస్కు అలవాటైపోయింది
- 39 ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం మరిచిపోయారా? అంటూ నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు. ‘‘38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు బీఆర్ఎస్కు గుర్తుకురాలేదా?, ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తీర్పు కాపీలు తొందరగా రావు.. ఆ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదా?, న్యాయపోరాటం చేసుకొవచ్చు… మాకు అభ్యంతరం లేదు.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
Also Read
‘‘ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందే. సభాపతి ఇరుపక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా తీర్చు ఇచ్చారు. స్పీకర్పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిరాయింపులపైన మాట్లాడడం ఆశ్చర్యం. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని కేబినెట్లోకి తీసుకోవడం మరిచిపోయారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం మరిచిపోయారా?, 10 ఏళ్లలో 39 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోవడం మరిచిపోయారా?.’’ అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
‘‘ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బీఆర్ఎస్ పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. స్పీకర్ తీర్పు పైన బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లొచ్చు.. ఇంకా పైకోర్టులకు వెళ్లొచ్చు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక విధంగా.. రాకపోతే మరో విధంగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు దశల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కడుపు మంటతో బీఆర్ఎస్ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కేసీఆర్లా మా సీఎం అప్రజాస్వామికంగా పాలన చేయడం లేదు. పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్పీకర్ తీర్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మెస్సీ లాంటి దిగ్గజ్జ ఫుట్బాల్ ఆటగాడు హైదరాబాద్కు వచ్చినా ఓర్వలేకపోతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!