Aadi Srinivas: ఏం జరిగినా విమర్శించడం బీఆర్ఎస్కు అలవాటైపోయింది
- బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన ఆది శ్రీనివాస్
- ఏం జరిగినా విమర్శించడం బీఆర్ఎస్కు అలవాటైపోయింది
- 39 ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం మరిచిపోయారా? అంటూ నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు. ‘‘38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు బీఆర్ఎస్కు గుర్తుకురాలేదా?, ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తీర్పు కాపీలు తొందరగా రావు.. ఆ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదా?, న్యాయపోరాటం చేసుకొవచ్చు… మాకు అభ్యంతరం లేదు.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
‘‘ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందే. సభాపతి ఇరుపక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా తీర్చు ఇచ్చారు. స్పీకర్పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిరాయింపులపైన మాట్లాడడం ఆశ్చర్యం. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని కేబినెట్లోకి తీసుకోవడం మరిచిపోయారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం మరిచిపోయారా?, 10 ఏళ్లలో 39 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోవడం మరిచిపోయారా?.’’ అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
‘‘ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బీఆర్ఎస్ పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. స్పీకర్ తీర్పు పైన బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లొచ్చు.. ఇంకా పైకోర్టులకు వెళ్లొచ్చు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక విధంగా.. రాకపోతే మరో విధంగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు దశల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కడుపు మంటతో బీఆర్ఎస్ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కేసీఆర్లా మా సీఎం అప్రజాస్వామికంగా పాలన చేయడం లేదు. పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్పీకర్ తీర్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మెస్సీ లాంటి దిగ్గజ్జ ఫుట్బాల్ ఆటగాడు హైదరాబాద్కు వచ్చినా ఓర్వలేకపోతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?