Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
- ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- అధికారులు విఫలం అయ్యారంటూ మందలింపు
- టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నగర వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా విపక్ష నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్పై మమతను ప్రశ్నించిన బీజేపీ
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
తాజాగా ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయంటూ మందలించింది. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ, పెరుగుతున్న వాయు కాలుష్యానికి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలుగా పేర్కొంది. తక్షణమే టోల్ ప్లాజాలను మూసేయాలని ఆదేశించింది. తాత్కాలిక నష్టాలను పౌర సంస్థతో భర్తీ చేసుకోవచ్చని సూచించింది.
ఇది కూడా చదవండి: Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
కాలుష్య నియంత్రణ కోసం తాత్కాలిక లేదా స్వల్ప కాలిక చర్యలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, ఆన్లైన్ తరగతులను అనుమతించడంపై సవాళ్లు సహా పిల్లలపై కాలుష్యం ప్రభావంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు.. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇటువంటి చర్యలు తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఉద్దేశించిన మధ్యంతర విధాన నిర్ణయాలు అని పేర్కొంది. శీతాకాలంలో పాఠశాలలు 10 నుంచి 15 రోజులు మూసివేయబడతాయని ధర్మాసనం తెలిపింది.
ఇక BS-IV ఉత్తర్వులను సవరించింది. ఏ కారణంతోనైనా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. పాత వాహనాలు కాలుష్య స్థాయిలను మరింత దిగజారుస్తున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..