Addanki Dayakar : 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?
- అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా.?
- కేటీఆర్ కు అసహనం ఎందుకు.?
- బీఆర్ఎస్లో ‘420’ నాయకులు మాత్రమే మిగిలారు
- రాజీవ్ గాంధీ పేరు తీస్తే తాట తీస్తాం : అద్దంకి దయాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను పెద్దది అని చెప్పుకోవడం సరైందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దీక్ష నిజంగా ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఆ దీక్షను మహోన్నతంగా చూపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరవీరుల త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేశారు. అలాంటి త్యాగాలను పక్కన పెట్టి కేసీఆర్ దీక్షను ప్రోత్సహించడం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ నాటకమని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ దీక్షపై విమర్శలు చేస్తే కేటీఆర్ ఎందుకు అంత అసహనం చూపుతున్నాడని దయాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్లో పనిచేసిన కాలంలో తెలంగాణ కోసం చిన్నారెడ్డి సంతకాల సేకరణలో మహేష్ గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సాగరహారం రోజున కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించారు.
Also Read
బీఆర్ఎస్ నాయకత్వంపై దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ విలీనానికి కేసీఆర్ అవకాశవాద రాజకీయాల వల్లే అడ్డుపడ్డాడని, మిలియన్ మార్చ్ను కూడా వ్యతిరేకించాడని తెలిపారు. గద్దర్, కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్య వంటి ఉద్యమకారులు కేసీఆర్కు నచ్చరని అన్నారు. ఉద్యమ సమయంలో మరణించిన శ్రీకాంతాచారిని బీఆర్ఎస్ గుర్తు చేసుకోదని ఎత్తి చూపారు.
Railway Line : రామగుండం-మణుగూరు రైల్వే లైన్కు ఆమోదం..!
సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ అనేకసార్లు చెప్పినా, అదే సోనియా గాంధీని తర్వాత అవమానించడం అతని స్వభావానికి నిదర్శనమని దయాకర్ చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను చంపడానికి కేసీఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి సోనియా గాంధీకి తెలంగాణ బహుమతి ఇచ్చారని, బీఆర్ఎస్గా మారిన రోజే కేసీఆర్ పార్టీలో తెలంగాణ ఆత్మ చనిపోయిందని విమర్శించారు. అందె శ్రీ అంత్యక్రియల సందర్భంగా రేవంత్ రెడ్డి చూపిన మానవత్వం అందరిని ఆకట్టుకుందని అన్నారు.
కేటీఆర్ రాజీవ్ గాంధీపై వ్యాఖ్యలు చేస్తే సహించబోమని దయాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో 420 ముద్ర వేసుకున్న నాయకులు మాత్రమే మిగిలారని, సర్పంచ్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని దోచుకున్నవారు బీఆర్ఎస్ నాయకులేనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు చూపుతున్న గౌరవం ప్రత్యేకమని, కేసీఆర్ మాత్రం ఉద్యమకారులను జైల్లో పెట్టిన చరిత్ర కలిగి ఉన్నాడని దయాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయన పాలన మానవతా స్పూర్తిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!