Addanki Dayakar : 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?
- అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా.?
- కేటీఆర్ కు అసహనం ఎందుకు.?
- బీఆర్ఎస్లో ‘420’ నాయకులు మాత్రమే మిగిలారు
- రాజీవ్ గాంధీ పేరు తీస్తే తాట తీస్తాం : అద్దంకి దయాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను పెద్దది అని చెప్పుకోవడం సరైందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దీక్ష నిజంగా ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఆ దీక్షను మహోన్నతంగా చూపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరవీరుల త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేశారు. అలాంటి త్యాగాలను పక్కన పెట్టి కేసీఆర్ దీక్షను ప్రోత్సహించడం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ నాటకమని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ దీక్షపై విమర్శలు చేస్తే కేటీఆర్ ఎందుకు అంత అసహనం చూపుతున్నాడని దయాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్లో పనిచేసిన కాలంలో తెలంగాణ కోసం చిన్నారెడ్డి సంతకాల సేకరణలో మహేష్ గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సాగరహారం రోజున కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించారు.
Also Read
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
బీఆర్ఎస్ నాయకత్వంపై దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ విలీనానికి కేసీఆర్ అవకాశవాద రాజకీయాల వల్లే అడ్డుపడ్డాడని, మిలియన్ మార్చ్ను కూడా వ్యతిరేకించాడని తెలిపారు. గద్దర్, కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్య వంటి ఉద్యమకారులు కేసీఆర్కు నచ్చరని అన్నారు. ఉద్యమ సమయంలో మరణించిన శ్రీకాంతాచారిని బీఆర్ఎస్ గుర్తు చేసుకోదని ఎత్తి చూపారు.
Railway Line : రామగుండం-మణుగూరు రైల్వే లైన్కు ఆమోదం..!
సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ అనేకసార్లు చెప్పినా, అదే సోనియా గాంధీని తర్వాత అవమానించడం అతని స్వభావానికి నిదర్శనమని దయాకర్ చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను చంపడానికి కేసీఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి సోనియా గాంధీకి తెలంగాణ బహుమతి ఇచ్చారని, బీఆర్ఎస్గా మారిన రోజే కేసీఆర్ పార్టీలో తెలంగాణ ఆత్మ చనిపోయిందని విమర్శించారు. అందె శ్రీ అంత్యక్రియల సందర్భంగా రేవంత్ రెడ్డి చూపిన మానవత్వం అందరిని ఆకట్టుకుందని అన్నారు.
కేటీఆర్ రాజీవ్ గాంధీపై వ్యాఖ్యలు చేస్తే సహించబోమని దయాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో 420 ముద్ర వేసుకున్న నాయకులు మాత్రమే మిగిలారని, సర్పంచ్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని దోచుకున్నవారు బీఆర్ఎస్ నాయకులేనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు చూపుతున్న గౌరవం ప్రత్యేకమని, కేసీఆర్ మాత్రం ఉద్యమకారులను జైల్లో పెట్టిన చరిత్ర కలిగి ఉన్నాడని దయాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయన పాలన మానవతా స్పూర్తిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
-
Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్గా బాబర్ రీఎంట్రీ..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!