KCR To Modi: మోడీ నా ఫ్రెండ్. అయినా.. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా: సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR To Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. నీతి ఆయోగ్ సమావేశంలో నాలుగు గంటల పాటు కూర్చొని నాలుగు నిమిషాలు మాట్లాడమంటే ఎలా అని అన్నారు. టైం పాస్ కోసం పల్లీలు, బిస్కెట్లు, అవీ ఇవీ తింటూ కూర్చోవాలా అని ఎద్దేవా చేశారు. ”అక్కడ మాట్లాడితే ఎలాగూ పట్టించుకోరని ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఈ రకంగానైనా నేను నీతి ఆయోగ్ మీటింగ్ను ఎందుకు బహిష్కరించానో దేశం చర్చించుకుంటుంది.
నాకు కావాల్సింది అదే. కేంద్ర ప్రభుత్వం తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటోంది. 5జీ స్పెక్ట్రం ఒక కుంభకోణం. 5 లక్షల కోట్లు అంచనా వేస్తే లక్షన్నర కోట్లే రావటమేంటి? పాలు, చేనేతలు, స్మశానాల మీద జీఎస్టీ వేయొద్దు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అది సరికాదు. రాహుల్.. నువ్వు నా ఫ్రెండ్ అయినా ఇవాళ నువ్వు అడిగే ఏ ప్రశ్నలకూ సమాధానం చెప్పదల్చుకోలేదు. నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు సారీ. రేపు మళ్లీ మీడియా ముందుకు వస్తా. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులు చెబుతా.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
మోడీ నా ఫ్రెండ్. అయినా దేశం కోసం ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేస్తోంది. పీఎస్యూలు తీసుకునే లోన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణనలోకి తీసుకుంటామంటే ఎట్లా? నేను మొన్న ఢిల్లీకి వెళ్లి 5 రోజులు కూర్చొని ఎఫ్ఆర్బీఎం గురించి కేంద్రాన్ని నిలదీసిన. దీంతో దెబ్బకు దిగొచ్చింది. ఎఫ్ఆర్బీఎం పేరిట విధించిన కోతలను ఎత్తేయాలి. లేకపోతే రాష్ట్రాలు డెవలప్ కాలేవు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశం ఉంటుంది.
నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మోడీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నేను ఊరుకోను. ఇప్పుడు మాటలు రూపంలో అడుగుతున్నాం. వినకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాం. పాత ప్రభుత్వాలు పెట్టిన సంక్షేమ పథకాలను చెరిపివేసే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కేసీఆర్ని తిట్టి పబ్బం గడుపుకుంటామంటే కుదరదు.
నేను మాట్లాడుతున్న ఈ మాటలు చరిత్రలో నిలిచిపోతాయి. 5జీ స్పెక్ట్రం వెనకున్న మతలబేంది? ఆ రోజు 2జీ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మరి ఇవాళ మీరు చేసిందేంటి?. మేకిన్ ఇండియా అంటున్నారు. మన దేశ జెండాలను, గడ్డం గీసుకునే బ్లేళ్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఇక మేకిన్ ఇండియా ఎందుకు? కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!