ACB Raid : ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి..! రైతునుంచి….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి చిక్కారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
read also: India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి!
Also Read
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన రైతు శ్రీరాములు, చిన్న ఆముదాలపాడు గ్రామంలోని సర్వే నంబరు 63/ఏ2 లో 2.34 ఎకరాల భూమిని కొత్తపేట మాణిక్యమ్మ నుంచి 2020లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే.. ఇదే సర్వే నంబరులో తన సోదరుడు ఎల్లస్వామి కూడా 2.22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కాగా..ధరణి పోర్టల్లో తాము కొనుగోలు చేసిన భూమి వివరాలను సరిచూసుకోగా భూదానం కింద నమోదు కావడాన్ని గుర్తించారు. దీంతో.. గత అక్టోబరులో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అయితే జూన్ 10న శ్రీరాములు అన్న ఎల్లస్వామి భూమిని ధరణి పోర్టల్లో భూదానం నుంచి తొలగించినట్లు సమాచారం అందింది. దీనిపై శ్రీరాములు అదే నెల 19న తహసీల్దార్ వీరభద్రప్పను, సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిశారు. అయితే.. వారు రూ.10వేలు డిమాండు చేశారు. అంత డబ్బులు చెల్లించలేనని తెలపడంతో.. చివరికి రూ.7,500కు బేరం కుదిరింది. అయితే..ఆవేదన చెందిన రైతు , ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో శ్రీరాములు నుంచి సాయిబాబ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!