ACB Raid : ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి..! రైతునుంచి….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి చిక్కారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
read also: India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి!
Also Read
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
- Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్పై బిగ్ ప్రశ్న.!
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన రైతు శ్రీరాములు, చిన్న ఆముదాలపాడు గ్రామంలోని సర్వే నంబరు 63/ఏ2 లో 2.34 ఎకరాల భూమిని కొత్తపేట మాణిక్యమ్మ నుంచి 2020లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే.. ఇదే సర్వే నంబరులో తన సోదరుడు ఎల్లస్వామి కూడా 2.22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కాగా..ధరణి పోర్టల్లో తాము కొనుగోలు చేసిన భూమి వివరాలను సరిచూసుకోగా భూదానం కింద నమోదు కావడాన్ని గుర్తించారు. దీంతో.. గత అక్టోబరులో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అయితే జూన్ 10న శ్రీరాములు అన్న ఎల్లస్వామి భూమిని ధరణి పోర్టల్లో భూదానం నుంచి తొలగించినట్లు సమాచారం అందింది. దీనిపై శ్రీరాములు అదే నెల 19న తహసీల్దార్ వీరభద్రప్పను, సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిశారు. అయితే.. వారు రూ.10వేలు డిమాండు చేశారు. అంత డబ్బులు చెల్లించలేనని తెలపడంతో.. చివరికి రూ.7,500కు బేరం కుదిరింది. అయితే..ఆవేదన చెందిన రైతు , ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో శ్రీరాములు నుంచి సాయిబాబ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
-
BCCI Partners: బీసీసీఐతో చాట్జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!