Rangareddy Crime: కన్న బిడ్డను అమ్మింది.. సంచిలో శవమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ముగ్గురు కలిసి ఓ మహిళను హత్య చేశారు. మహిళ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Read also: Ice Cream: ఐస్క్రీం తింటున్నారా? బీ కేర్ ఫుల్!
Also Read
మహబూబ్ నగర్ జిల్లా రాజ్ పూర్ మండలం కొర్ర తండాకు చెందిన సబావత్ రాములు, శారద అనే దంపతులు షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ రోడ్డులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి మగబిడ్డ పుట్టగానే.. ఆ చిన్నారి మానసిక పరిస్థితి బాగోకపోవడంతో.. మరో మగబిడ్డను కోరుకునేవారు. అదే సమయంలో బీహార్కు చెందిన దేవకి, పురుషోత్తం దంపతులు అదే కాలనీలో నివసిస్తున్నారు. రాము, శారద ఒకరికొకరు బాగా పరిచయమయ్యారు. వారితో తమ బాధలను పంచుకున్నారు. దీంతో దేవకి, పురుషోత్తం తమకు పుట్టిన మగబిడ్డను అమ్మేందుకు సిద్ధమయ్యారు. రూ.50 లక్షలకు బాలుడిని విక్రయించేందుకు పురుషోత్తం ఒప్పందం చేసుకున్నాడు. కానీ పురుషోత్తం భార్య దేవకి మాత్రం అబ్బాయిని అమ్మడం ఇష్టం లేదు. చివరకు డబ్బు అడగమని భర్త బలవంతం చేయడంతో ఆమె అంగీకరించింది. అయితే దేవకి మాత్రం తన సొంత కొడుకుని చూసేందుకు రాముడి ఇంటికి వెళ్లేది. పదే పదే ఇంటికి రావద్దని రాములు భార్య శారద, చెల్లెలు జ్యోతిలు దేవకిని హెచ్చరించారు. అయితే ఎప్పటికప్పుడు వస్తుండటంతో ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేశారు. అందులో భాగంగానే దేవకిని చంపాలని నిర్ణయించుకున్నారు.
Read also: Kamal Haasan: అందరూ కలిసిరావడం బాగుంది.. గోల్డెన్ డేస్ వచ్చినట్లే
సోమవారం రాత్రి రాములు ఇంటికి వచ్చిన దేవకి.. కొడుకును సరిగా చూసుకోవడం లేదని రాములు, శారదతో గొడవకు దిగింది. ఇదే అదునుగా భావించి దేవకిని హత్య చేశారు. మాట్లాడుకుందాం అని దేవకిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి దేవకి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం దేవకి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి తీసుకెళ్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో షాద్నగర్ పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా గోనె సంచిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. హత్య చేసి మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దేవకి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!