Ice Cream: ఐస్క్రీం తింటున్నారా? బీ కేర్ ఫుల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ice Cream: రాష్ట్రంలో కల్తీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. దేన్నీ వదలకుండా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంటనూనె, పాలు వంటి నిత్యావసర పదార్థాలే కాకుండా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్లో నకిలీ చాక్లెట్ల కేసు మరువకముందే మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా నకిలీ ఐస్క్రీమ్లు తయారు చేస్తున్న కంపెనీలను పోలీసులు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నారు. వాటిని బండ్ల వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతే కాకుండా బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ ను ఐస్ క్రీమ్ లకు అతికించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఐస్క్రీమ్ తయారీ పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. అక్కడ ఐస్ క్రీం తయారీ విధానం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్ లు తయారవుతున్నాయి. మురుగు నీటి పక్కనే రసాయనాలు, రంగుల నీరుతో ఐస్క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న పరిశ్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు రెండు ఐస్ క్రీమ్ తయారీ కంపెనీలను మూసివేశారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
Read also: KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తాజాగా చందానగర్లోనూ కల్తీ ఐస్క్రీమ్ల దందా ఎక్కువైంది. హానికరమైన రసాయనాలను ఉపయోగించి నకిలీ ఐస్క్రీమ్లను తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. నకిలీ ఐస్క్రీమ్లతో పాటు ఫ్లేవర్ల లేబుల్స్, బ్రాండ్ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా ఈ నకిలీ ఐస్క్రీమ్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గత ఐదేళ్లుగా కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. రసాయనాలతో తయారైన ఇలాంటి ఐస్ క్రీమ్ లు తింటే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐస్క్రీమ్లు తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, బీ కేర్ ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
Dead Body : దీనమ్మ జీవితం.. శవాలను ముక్కలుగా కోసి అమ్మేస్తున్నారు జర జాగ్రత్త
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!