KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మే 5న సాయంత్రం హెలికాప్టర్ లో కిట్స్ కాలేజీ కి చేరుకుంటారని అన్నారు. పేదల సంక్షేమం కోసం వందలకోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 181.45కోట్ల పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. కార్మిక ఉద్యోగ మాసోత్సవాల్లో భాగంగా 6960 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని అన్నారు. కార్మిక భవనంకు, పూలే భవనానాకి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఆ భవనంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్లమ్ ఏరియాను సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బందం చెరువు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
Read also: Nehru Zoo Park: బాడ్ న్యూస్.. నెహ్రూ జూపార్క్ టికెట్ల ధరలను భారీగా పెంచిన సర్కార్
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అనంతరం కాజీపేట సెయింట్ గ్రాబియల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాలవర్షంతో రైతులకు అఫార నష్టం వాటిల్లిందని అన్నారు. రైతుకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. నష్టపోయిన అధైర్యపడవద్దు.. రైతులను ఆదుకుంటామని సీఎం కేసిఆర్ భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చిల్లర పార్టీలు చిల్లర రాజకీయాలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో రైతులు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరో చెప్పే మాటలు విని రైతులు గాయిగత్తర కావద్దని ధీమా వ్యక్తం చేశారు.
Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!