Election Commission: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్.. ప్రకటనలు నిలిపివేసిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు రాష్ట్రంలోని పలు పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిలిపి వేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదులు చేయగా.. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలను ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. ఇప్పటికే బీజీపీ 5, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 ప్రకటనలను ఈసీ నిలిపివేసింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని చెడగొడుతున్నారని రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
Read Also: Mrunal Thakur: మృణాల్ మత్తులో సోషల్ మీడియా…
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఇక, బీఆర్ఎస్ అభ్యర్థులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సైతం ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా లేవని జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ మరో కంప్లైంట్ చేశారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సక్రమంగా లేవని బీఎస్పీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆర్వోలు సైతం తిరస్కరించారు.
Read Also: Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
అయితే, నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఆర్వోలు అప్రూవల్ చేశారని పలు ఫిర్యాదులు చేశారు. ఆర్వోలు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజాశాంతి, స్వతంత్ర అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సీఈవో వికాస్ రాజ్ ఆఫీస్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తమని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే సీఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!