Election Commission: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్.. ప్రకటనలు నిలిపివేసిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు రాష్ట్రంలోని పలు పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిలిపి వేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదులు చేయగా.. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలను ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. ఇప్పటికే బీజీపీ 5, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 ప్రకటనలను ఈసీ నిలిపివేసింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని చెడగొడుతున్నారని రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
Read Also: Mrunal Thakur: మృణాల్ మత్తులో సోషల్ మీడియా…
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఇక, బీఆర్ఎస్ అభ్యర్థులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సైతం ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా లేవని జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ మరో కంప్లైంట్ చేశారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సక్రమంగా లేవని బీఎస్పీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆర్వోలు సైతం తిరస్కరించారు.
Read Also: Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
అయితే, నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఆర్వోలు అప్రూవల్ చేశారని పలు ఫిర్యాదులు చేశారు. ఆర్వోలు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజాశాంతి, స్వతంత్ర అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సీఈవో వికాస్ రాజ్ ఆఫీస్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తమని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే సీఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి