Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది. దీంతోపాటు గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలపై సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) సాయంత్రం ప్రజా భవన్ లో ‘ప్రాజెక్టుల నిర్మాణం – అక్రమాలు’ అనే అంశంపై తమ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి వివరించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 13న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలపై ఎదురుదాడి చేయాలని సూచించారు.
Read also: Seethapalli Vagu: విహారయాత్రలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
- Kishan Reddy: కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయాన్ని కాల రాసింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాన్ని ఖరారు చేసి ఈనెల 13న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు విపక్షాలను ఆహ్వానించినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఏది ఏమైనా బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలవాల్సి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొంతు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా.. లేక మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశారా అనే విషయంపై స్పష్టత లేదు. బొంతు రామ్మోహన్ గత రెండు దఫాలుగా ఉప్పల్ బరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించినా ఆ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన సీఎం రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Assam: చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!