రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, వైసీపీ ల నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు.…
గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..…
రేపటి నుంచి 36 గంటల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గస్థాయిలో రెండు రోజులపాటు నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు.…
ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని…
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి…
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు ఇప్పుడు చిచ్చు పెడుతున్నాయి.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.. దీంతో, దాడులు, ఆందోళనలు, నిరసనలు, బంద్లకు వెళ్లిపోయింది పరిస్థితి. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.. అయితే, దానిని జీర్ణించుకోలేక నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్ చూపించారని.. దాని ప్రభావం…
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసగా.. ఓవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా… మరోవైపు.. టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ కౌంటర్గా కార్యక్రమాలను పూనుకుంది… ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు చేపట్టాలి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని…
ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు…
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు.…