ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైవ్ వికెట్స్ ఆల్ సాధించిన తొలి బౌలర్గా బుమ్రా నిలిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 21 పరుగులిచ్చి.. 5 వికెట్స్ పడగొట్టాడు. ఈ క్రమంలో.. మ్యాచ్ అనంతరం బుమ్రా యువ బౌలర్లకు కొన్ని సూచనలు ఇచ్చాడు. తన బౌలింగ్ స్కిల్స్ గురించి చెప్పాడు.