లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
Yogi Adityanath: గోహత్యకు కాంగ్రెస్ అనుమతిస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల కోసం మహిళల సంపదను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షరియా చట్టం (ముస్లిం) తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
UP CM Yogi Adityanath Deepfake Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘డీప్ఫేక్ వీడియోస్’ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు డీప్ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టినా.. ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. డయాబెటిస్ ఔషధానికి సీఎం…
CM Yogi: లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
Best CMs: దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.