Yogi Adityanath: కేజ్రీవాల్ జైలుకు వెళ్లి మతిస్థిమితం కోల్పోయాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ని పదవి నుంచి దించేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి స్పందించారు. జైలుకు వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయారని అన్నారు. గురువారం కేజ్రీవాల్పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ ఉదయం లక్నోలో సమాజ్వాదీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి కేజ్రీవాల్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రధాని మంత్రి చేస్తారని, యోగి ఆదిత్య నాథ్ని యూపీ సీఎంగా తొలగిస్తారని చెప్పారు.
Read Also: TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు
Also Read
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ఈ వ్యాఖ్యలపై యోగి స్పందిస్తూ.. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత మతిస్థిమితం కోల్పోయారని, అన్నా హజారే ఆశయాలను తుంగలో తొక్కి అవినీతి పక్షాణ నిలిచిన ఢిల్లీ సీఎం తనను టార్గెట్ చేస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. హమీర్పూర్-మహోబా లోక్సభ స్థానం అభ్యర్థికి మద్దతుగా తింద్వారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కేజ్రీవాల్ అన్నా హజారే ఆశలను వమ్ము చేశారని, ఈ ద్రోహానికి కేజ్రీవాల్ని ఆయన ఎప్పుడూ క్షమించరని అన్నారు.
నిరాశతో ఉన్న ప్రతిపక్షాలు మోడీ వయసును సాకుగా చూపుతోందని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నంత కాలం ఢిల్లీ ప్రజలు ‘దగ్గు’ తగ్గినట్లు ఉపశమనం పొందారు, మళ్లీ జైలు నుంచి విడుదలై వారికి ‘దగ్గు’ వచ్చే అవకాశాన్ని తెప్పించారని ఆదిత్యనాథ్ అన్నారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు అతడిని జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. 50 రోజుల పాటు అతను జైలులో గడిపాడు.
తాజావార్తలు
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!