Yogi Adityanath: ‘‘అంత్యక్రియలకు నలుగురు కావాలి, కానీ’’.. కాంగ్రెస్పై విరుచుకుపడిన యోగి..
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలు కాంగ్రెస్కి 2 సీట్లు ఇచ్చారని అన్నారు. ఒక వ్యక్తి అంత్యక్రియల సమయంలో అంతిమ యాత్రకు నలుగుకు వ్యక్తులు కావాలి, కానీ వారికి ఇద్దరు మాత్రమే ఉన్నారు, వచ్చే సారి వారి గేమ్ ఓవర్ అంటూ వ్యాఖ్యానించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ‘‘రామ్ నామ్ సత్య హై’’ అని నినాదాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తారని ఆయన అన్నారు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలో కేవలం 2 స్థానాలకే పరిమితమై కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఆ పార్టీకి 2.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read
- West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
- Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
- One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
Read ALSO: OMG : వెన్నెల కిషోర్ “ఓ మంచి ఘోస్ట్ “కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్.. భయపెడుతున్న గ్లింప్స్ వీడియో..
అమేథీలో, రాయ్బరేలీలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ యూపీలో పోటీ చేసే సాహసం చేయకుండా పారిపోతున్నారని సీఎం అన్నారు. అయితే, 24 గంటల్లో ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఈ రోజు చెప్పారు. అభ్యర్థులను ప్రకటించే నిర్ణయం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు వెల్లడించారు.
మే 20న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి పోటీ చేసి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండీ, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు ఉంటే సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తాజావార్తలు
-
Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
-
Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..
-
Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
-
Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!