Yogi Adityanath: ‘‘అంత్యక్రియలకు నలుగురు కావాలి, కానీ’’.. కాంగ్రెస్పై విరుచుకుపడిన యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలు కాంగ్రెస్కి 2 సీట్లు ఇచ్చారని అన్నారు. ఒక వ్యక్తి అంత్యక్రియల సమయంలో అంతిమ యాత్రకు నలుగుకు వ్యక్తులు కావాలి, కానీ వారికి ఇద్దరు మాత్రమే ఉన్నారు, వచ్చే సారి వారి గేమ్ ఓవర్ అంటూ వ్యాఖ్యానించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ‘‘రామ్ నామ్ సత్య హై’’ అని నినాదాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తారని ఆయన అన్నారు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలో కేవలం 2 స్థానాలకే పరిమితమై కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఆ పార్టీకి 2.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
Read ALSO: OMG : వెన్నెల కిషోర్ “ఓ మంచి ఘోస్ట్ “కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్.. భయపెడుతున్న గ్లింప్స్ వీడియో..
అమేథీలో, రాయ్బరేలీలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ యూపీలో పోటీ చేసే సాహసం చేయకుండా పారిపోతున్నారని సీఎం అన్నారు. అయితే, 24 గంటల్లో ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఈ రోజు చెప్పారు. అభ్యర్థులను ప్రకటించే నిర్ణయం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు వెల్లడించారు.
మే 20న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి పోటీ చేసి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండీ, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు ఉంటే సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!