Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాంపూర్లో రూ.1,488.89 కోట్లతో 466, శ్రావస్తిలో రూ.2,60.37 కోట్లతో చేపట్టిన 31 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. దేవీపటాన్ డివిజన్లో మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు, ఎయిర్పోర్టులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని, ఈరోజు ఇక్కడ 350 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించామని, వచ్చే నాటికి బల్రాంపూర్ జిల్లాకు కూడా మెడికల్ కాలేజీని అందించబోతున్నామని చెప్పారు. శ్రావస్తికి విమానాశ్రయం వచ్చింది. బలరాంపూర్లో విశ్వవిద్యాలయం ఉండాలనే కల కూడా సాకారం అవుతోందన్నారు.
Read Also: PM Modi: ఈసారి కేరళలో రెండంకెల సీట్లు గెలుచుకుంటాం
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
ఈ కమిషనరేట్లోని నాలుగు జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో రెండు ఇప్పటికే నిర్మించామని, మూడోది నేడు ప్రారంభోత్సవం జరుపుతున్నదని, అంతేకాకుండా నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సరయూనగర్ జాతీయ ప్రాజెక్టును కూడా ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో అభివద్ధి ఉన్న జిల్లాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రసంగించారు. బలరాంపూర్, శ్రావస్తిలు మా పటేశ్వరిచే ఆశీర్వదించబడుతున్నాయన్నారు. భారతదేశం, నేపాల్ నుంచి భక్తులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.1949లో రామజన్మభూమి ఉద్యమం ఈ బల్రామ్పూర్ నుంచి ప్రారంభమైందని, ఈ రోజు ప్రపంచం మొత్తం అయోధ్యలోని పుణ్యభూమిలో శ్రీరాముడు ప్రత్యక్షమైన మహిమాన్వితమైన క్షణాన్ని చూసిందని, ఇక్కడ చేసిన ప్రతి తీర్మానం ఎప్పుడూ నెరవేరుతుందని సీఎం అన్నారు.
Read Also: Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక
ఎప్పటి నుంచో బల్రాంపూర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. నానా జీ దేశ్ముఖ్ ఆధ్యాత్మిక యాత్రకు ఈ భూమి సాక్ష్యాలుగా ఉందని, అటల్జీ కూడా ఇక్కడి నుంచే తన రాజకీయ యాత్రను ప్రారంభించారని ఆయన సూచించారు. గతంలో దేవీ పటాన్ డివిజన్లో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, గోండా నుంచి దేవీ పటాన్ ఆలయానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా ఉంటేనే అభివృద్ధి ఊపందుకుంటుందని, ప్రభుత్వం అందించే సౌకర్యాలు వివక్ష లేకుండా పేదలకు అందుతాయని పేర్కొన్నారు. 2017లో వచ్చిన వరదలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో శ్రావస్తి, బల్రాంపూర్ జిల్లాలు రెండూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొందని ముఖ్యమంత్రి సూచించారు. నదిలో పూడిక తీయడం జరిగిందని, ఫలితంగా 2017 నుంచి ఇక్కడి జిల్లా కేంద్రానికి వరద నీరు చేరలేదన్నారు. ప్రజల కోసం హోలీ కానుకలతో వచ్చానని, ఇది రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడి యూనివర్శిటీలో సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి ఆధారిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. పిల్లలను సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి ఒక్క ఢిల్లీకే పరిమితం కాదని, ప్రతి పల్లెకు చేరుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!