Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story We Will Never Allow Criminalization Of Politics Says Chief Minister Yogi Adityanath

Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..

Published Date :March 15, 2024 , 6:12 pm
By Mahesh Jakki
Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yogi Adityanath: దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాంపూర్‌లో రూ.1,488.89 కోట్లతో 466, శ్రావస్తిలో రూ.2,60.37 కోట్లతో చేపట్టిన 31 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. దేవీపటాన్‌ డివిజన్‌లో మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు, ఎయిర్‌పోర్టులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని, ఈరోజు ఇక్కడ 350 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించామని, వచ్చే నాటికి బల్‌రాంపూర్‌ జిల్లాకు కూడా మెడికల్‌ కాలేజీని అందించబోతున్నామని చెప్పారు. శ్రావస్తికి విమానాశ్రయం వచ్చింది. బలరాంపూర్‌లో విశ్వవిద్యాలయం ఉండాలనే కల కూడా సాకారం అవుతోందన్నారు.

Read Also: PM Modi: ఈసారి కేరళలో రెండంకెల సీట్లు గెలుచుకుంటాం

ఈ కమిషనరేట్‌లోని నాలుగు జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో రెండు ఇప్పటికే నిర్మించామని, మూడోది నేడు ప్రారంభోత్సవం జరుపుతున్నదని, అంతేకాకుండా నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సరయూనగర్ జాతీయ ప్రాజెక్టును కూడా ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. ప్రధాన మంత్రి మార్గద‌ర్శక‌త్వంలో అభివ‌ద్ధి ఉన్న జిల్లాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామ‌ని ముఖ్యమంత్రి ప్రసంగించారు. బలరాంపూర్, శ్రావస్తిలు మా పటేశ్వరిచే ఆశీర్వదించబడుతున్నాయన్నారు. భారతదేశం, నేపాల్ నుంచి భక్తులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.1949లో రామజన్మభూమి ఉద్యమం ఈ బల్‌రామ్‌పూర్‌ నుంచి ప్రారంభమైందని, ఈ రోజు ప్రపంచం మొత్తం అయోధ్యలోని పుణ్యభూమిలో శ్రీరాముడు ప్రత్యక్షమైన మహిమాన్వితమైన క్షణాన్ని చూసిందని, ఇక్కడ చేసిన ప్రతి తీర్మానం ఎప్పుడూ నెరవేరుతుందని సీఎం అన్నారు.

Read Also: Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక

ఎప్పటి నుంచో బల్‌రాంపూర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. నానా జీ దేశ్‌ముఖ్ ఆధ్యాత్మిక యాత్రకు ఈ భూమి సాక్ష్యాలుగా ఉందని, అటల్‌జీ కూడా ఇక్కడి నుంచే తన రాజకీయ యాత్రను ప్రారంభించారని ఆయన సూచించారు. గతంలో దేవీ పటాన్‌ డివిజన్‌లో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, గోండా నుంచి దేవీ పటాన్‌ ఆలయానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా ఉంటేనే అభివృద్ధి ఊపందుకుంటుందని, ప్రభుత్వం అందించే సౌకర్యాలు వివక్ష లేకుండా పేదలకు అందుతాయని పేర్కొన్నారు. 2017లో వచ్చిన వరదలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో శ్రావస్తి, బల్‌రాంపూర్‌ జిల్లాలు రెండూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొందని ముఖ్యమంత్రి సూచించారు. నదిలో పూడిక తీయడం జరిగిందని, ఫలితంగా 2017 నుంచి ఇక్కడి జిల్లా కేంద్రానికి వరద నీరు చేరలేదన్నారు. ప్రజల కోసం హోలీ కానుకలతో వచ్చానని, ఇది రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడి యూనివర్శిటీలో సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి ఆధారిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. పిల్లలను సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి ఒక్క ఢిల్లీకే పరిమితం కాదని, ప్రతి పల్లెకు చేరుతుందని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chief Minister Yogi Adityanath
  • criminalization of politics
  • latest news
  • telugu news
  • UP CM

తాజావార్తలు

  • T20 World Cup 2026: పాక్‌ కంటే దారుణంగా భారత్‌..! సెమీస్‌ ముందు టీమిండియాను టెన్షన్‌ పెడుతున్న గణాంకాలు..

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. హిజ్బుల్ నేతల లక్ష్యంగా దాడులు

  • Shahid Afridi: చాలాసార్లు చెప్పాను.. బౌలింగ్ ఎక్కడ చేయాలో తెలియదు.. అల్లుడు షాహీన్‌పై షాహిద్ అఫ్రిదీ ఆగ్రహం

  • Dubai: ఉద్రిక్తతల వేళ గుడ్‌న్యూస్.. విమాన సర్వీసులు ప్రారంభించినట్లు దుబాయ్ ప్రకటన

  • AP High Court: సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్ నాయక్ పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions