Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాంపూర్లో రూ.1,488.89 కోట్లతో 466, శ్రావస్తిలో రూ.2,60.37 కోట్లతో చేపట్టిన 31 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. దేవీపటాన్ డివిజన్లో మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు, ఎయిర్పోర్టులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని, ఈరోజు ఇక్కడ 350 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించామని, వచ్చే నాటికి బల్రాంపూర్ జిల్లాకు కూడా మెడికల్ కాలేజీని అందించబోతున్నామని చెప్పారు. శ్రావస్తికి విమానాశ్రయం వచ్చింది. బలరాంపూర్లో విశ్వవిద్యాలయం ఉండాలనే కల కూడా సాకారం అవుతోందన్నారు.
Read Also: PM Modi: ఈసారి కేరళలో రెండంకెల సీట్లు గెలుచుకుంటాం
Also Read
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఈ కమిషనరేట్లోని నాలుగు జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో రెండు ఇప్పటికే నిర్మించామని, మూడోది నేడు ప్రారంభోత్సవం జరుపుతున్నదని, అంతేకాకుండా నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సరయూనగర్ జాతీయ ప్రాజెక్టును కూడా ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో అభివద్ధి ఉన్న జిల్లాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రసంగించారు. బలరాంపూర్, శ్రావస్తిలు మా పటేశ్వరిచే ఆశీర్వదించబడుతున్నాయన్నారు. భారతదేశం, నేపాల్ నుంచి భక్తులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.1949లో రామజన్మభూమి ఉద్యమం ఈ బల్రామ్పూర్ నుంచి ప్రారంభమైందని, ఈ రోజు ప్రపంచం మొత్తం అయోధ్యలోని పుణ్యభూమిలో శ్రీరాముడు ప్రత్యక్షమైన మహిమాన్వితమైన క్షణాన్ని చూసిందని, ఇక్కడ చేసిన ప్రతి తీర్మానం ఎప్పుడూ నెరవేరుతుందని సీఎం అన్నారు.
Read Also: Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక
ఎప్పటి నుంచో బల్రాంపూర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. నానా జీ దేశ్ముఖ్ ఆధ్యాత్మిక యాత్రకు ఈ భూమి సాక్ష్యాలుగా ఉందని, అటల్జీ కూడా ఇక్కడి నుంచే తన రాజకీయ యాత్రను ప్రారంభించారని ఆయన సూచించారు. గతంలో దేవీ పటాన్ డివిజన్లో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, గోండా నుంచి దేవీ పటాన్ ఆలయానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా ఉంటేనే అభివృద్ధి ఊపందుకుంటుందని, ప్రభుత్వం అందించే సౌకర్యాలు వివక్ష లేకుండా పేదలకు అందుతాయని పేర్కొన్నారు. 2017లో వచ్చిన వరదలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో శ్రావస్తి, బల్రాంపూర్ జిల్లాలు రెండూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొందని ముఖ్యమంత్రి సూచించారు. నదిలో పూడిక తీయడం జరిగిందని, ఫలితంగా 2017 నుంచి ఇక్కడి జిల్లా కేంద్రానికి వరద నీరు చేరలేదన్నారు. ప్రజల కోసం హోలీ కానుకలతో వచ్చానని, ఇది రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడి యూనివర్శిటీలో సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి ఆధారిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. పిల్లలను సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి ఒక్క ఢిల్లీకే పరిమితం కాదని, ప్రతి పల్లెకు చేరుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!