Yogi Adityanath: మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: గోహత్యకు కాంగ్రెస్ అనుమతిస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల కోసం మహిళల సంపదను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు. దేశభక్తి నినాదాలు చేయడంతో వెనకాడే వారికి ఓట్లు వేయకూడదని యోగి ఓటర్లకు పిలుపునిచ్చారు. మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, ఇది గోహత్యనున అనుమతించడమే అని యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
‘‘ఈ సిగ్గు లేని వ్యక్తులు గోమాంసాన్ని తినే హక్కును కల్పిస్తామని వాగ్దానం చేస్తారు. అయితే మన గ్రంథాలు ఆవును తల్లిగా పిలుస్తాయి. వారు ఆవులను కసాయిల చేతుల్లోకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. భారతదేశం దీనికి అంగీకరిస్తుందా..?’’ అని యోగిని ఉటంకిస్తూ యూపీ బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. మైనారిటీలకు తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు, అంటే వారు గోహత్యలను అనుమతించడం గురించి మాట్లాడుతున్నారని యోగి అన్నారు. సంభాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్ లాల్ సైనీకి మద్దతు కూడగట్టేందుకు మొరాదాబాద్ జిల్లాలోని బిలారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆదిత్యనాథ్ ప్రసంగించారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Earthquake: తైవాన్లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు
ప్రధాని ఇటీవల కాంగ్రెస్పై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. మహిళల సంపదను స్వాధీనం చేసుకుని వాటిని రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు పంచాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రజల ఆస్తులనున సర్వే చేస్తామని మాట్లాడిందని పేర్కొన్నారు. ఒకరి ఇంట్లో నాలుగు గదులు ఉంటే అందులో రెండింటిని ఇస్తుందని, అంతే కాకుండా మహిళ ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోందని, దీన్ని దేశం ఎప్పటికీ అంగీకరించదని ఆయన అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004-14 వరకు ఇలాంటి ప్రయత్నాలనే చేసిందని యోగి ఆరోపించారు.
కర్ణాటకలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సచార్ కమిటీ సిఫార్సులను ఆయన ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలో వారికి ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తో్ందని, దేశంలో వనరులపై ముస్లింకే మొదటి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్ చెప్పారని ఆరోపించారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని అన్నారు.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!