Home
Yogi Adityanath
Yogi Adityanath News
-
CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..
ఓవైపు అయోధ్య రామ మందిర కానుకల చోరీ వివాదంగా మారిన సమయంలో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలో ఉందని, భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని ఆయన సోమవారం ప్రయాగ్ రాజ్లో అన్నారు. రాముడు అంటే జాతి అని, ఆయనే భారతదేశ ఆత్మ మూలమని చెప్పారు. దేశంలో ఈ రోజు చూస్తున్న రామ మందిరం అశోక్ సింఘాల్ సంకల్పం, కల ఫలితమేనని చెప్పారు. ఇదే సమయంలో యువతను… -
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర విరాళాల కేసులో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. అయోధ్య రామమందిర ట్రస్ట్కు సంబంధించిన భూ కొనుగోళ్లపై జరుగుతున్న దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆలయానికి వచ్చిన కానుకల దుర్వినియోగ ఆరోపణలతో ప్రారంభమైన విచారణ ఇప్పుడు భూ లావాదేవీల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రెండో దశ విచారణ కోసం అయోధ్యకు చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు… -
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేవారు. మొహర్రం సందర్భంగా ఇకపై వీధి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. హత్రాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు కత్తులతో అల్లర్లు ప్రేరేపిస్తూ హంగామా చేసే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన అన్నారు. మెరుగైన భద్రతా వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన… -
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
Yogi Adityanath: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే, అయోధ్య రామాలయ విరాళాలు దుర్వినియోగం చేసిన కేసులో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రాథమిక నివేదిక అందిన వెంటనే పోలీసుల చర్యలు ప్రారంభించారని ఆయన అన్నారు. దేవారియాలో జరిగిన… -
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
CM Yogi: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకాలతో, సనాతన ధర్మ విలువలపై ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారి పట్ల తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' (సహించేదే లేదు) విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఆలయ విరాళాల హేరఫేరి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక… -
Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తన అనుచరులకు మర్యాదగా ఎలా మాట్లాడాలో, సంయమనంతో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆడ పిల్లల గౌరవం… -
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అసద్ ఎన్కౌంటర్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఘజియాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై, యూపీ పోలీసులపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. చౌహాన్ హత్య తర్వాత పరారీలో ఉన్న అసద్ను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అతడిపై రూ. 50,000 రివార్డు కూడా ప్రకటించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున జరిగిన… -
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దేశరక్షణ కోసం అవసరమైతే బలప్రయోగం, ధర్మ హింస ముఖ్యమే అని స్పష్టం చేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహింసా పరమో… -
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని మీర్జాపూర్లో జిమ్లలో హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని, వారిని లవ్ ఉచ్చులోకి లాగా, ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించిన మాఫియాపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. 10 మంది నిందితులపై ‘‘గ్యాంగ్ స్టర్ చట్టం’’ కింద కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, నేర నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఖాన్,… -
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
CM YOGI: బక్రీద్ పండగకు ముందు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయకూడదు’’ అని సోమవారం బరేలీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. 28వ తేదీన రాబోయే ఈద్ పండుగను దృష్టిలో ఉంచుకుని, నమాజ్ను షిఫ్టులలో చేయాలని, వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని సీఎం యోగి పేర్కొన్నారు.చట్టం అందరికి సమానమని, జనాలు అధిక సంఖ్యలో ఉంటే విడతల వారీగా వారికి కేటాయించిన మతపరమైన ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవాలని…
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..