CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
- దేశం, సమాజానికి ముప్పుగా మారితే హింస అవసరమని యోగి వ్యాఖ్యలు
- అహింసే పరమ ధర్మం.. కానీ ధర్మరక్షణ కోసం బలప్రయోగం సమర్థనీయం
- బలమైన దేశాలతోనే ప్రపంచం స్నేహం చేస్తుందని వ్యాఖ్య
- భద్రత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దేశరక్షణ కోసం అవసరమైతే బలప్రయోగం, ధర్మ హింస ముఖ్యమే అని స్పష్టం చేశారు.
లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహింసా పరమో ధర్మః.. ధర్మ హింస తథైవ చ’’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ.. అహింస అత్యున్నత ధర్మమే అయినప్పటికీ ధర్మాన్ని, దేశాన్ని కాపాడే సందర్భంలో హింస కూడా ధర్మమే అని ఆయన అన్నారు. దేశం బలంగా ఉంటేనే ప్రపంచం గౌరవిస్తుందని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహం చేయాలని కోరుకుంటాయని ఆయన అన్నారు. బలహీనుల్ని ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని చెప్పారు. భారత సాయుధ దళాలు దేశ శత్రువుల్ని ఎదుర్కొనే తీరులో ఈ సూత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
Also Read
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- Kangana Ranaut: "మంటకు ఆజ్యం పోయవద్దు!" హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
- CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
అభివృద్ధికి భద్రతే పునాది అని, శాంతి, భద్రతల ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. 2017కు ముందు యూపీలో తరుచూ కర్ఫ్యూలు, మాఫియా ఆధిపత్యం, నేరాలు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్ర శాంతిభద్రతలు మెరుగయ్యాయని చెప్పారు. భారతదేశాన్ని సైనికులు కాపాడుతున్నారని, వారిని గౌరవించడం ప్రజల బాధ్యత అని అన్నారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర అపారమని, వారి త్యాగాలను గౌరవించాలని చెప్పారు.
తాజావార్తలు
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!