అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్టు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యాబై మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్దం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు. ఎస్వీ గోశాలపై కూటమి నేతలు, భూమన…
తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన చెప్పారు. దాంతో తిరుపతి గోశాల…
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. తన కారులో స్వయంగా భూమనను ఎస్వీ గోశాలకు తీసుకోస్తానుని, రావడానికి భూమన సిద్దంగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. అసత్య ప్రచారం నుంచి తప్పించుకోవడానికి ఇంటి దగ్గర, రోడ్డుమీద పడుకుని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. గోవుల విషయంలో భూమన అసత్యాలు చెప్పడం దారుణం అని, హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని బొజ్జల డిమాండ్ చేశారు. ఎస్వీ గోశాలకు…
మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు, విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పలువురు నేతలు దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మట్లాడుతూ.. దేవినేని నెహ్రూ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారన్నారు. ఆయన…
కడప జిల్లా లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు 14 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, ఒక ఎకరా అరటి సాగుకు రైతుకు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఖర్చవుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.14,000 నేలకొరిగిన అరటి చెట్లు తొలగించడానికి అయ్యే కూలీలకు కూడా సరిపోదన్నారు.…
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి లభించింది. మరికొద్దిసేపట్లో ఆయన గోశాలకు బయల్దేరనున్నారు. ఈరోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారంటూ…
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మనసు మారుతోందా? ఆయన పొలిటికల్ పిచ్ మార్చాలనుకుంటున్నారా? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా? లోకల్ పాలిటిక్స్ని బోర్గా ఫీలవుతున్నారా? ఇంతకీ ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారు బుగ్గన? అక్కడేం చేయాలనుకుంటున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేబినెట్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి. నాటి ఆర్థిక మంత్రిగా అష్టకష్టాలు పడి బండి లాగించేవారని చెబుతారు ఆయన సన్నిహితులు. అలాగే అసెంబ్లీలో పిట్ట కథలతో లింక్పెట్టి ఆయన మాట్లాడే తీరు కూడా ఆకట్టుకుంటుందని అంటారు.…
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్…
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం…