Jakkampudi Raja: దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు.. పథకాలకు చరమగీతం పలికారు!
- దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు
- రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది
- విడదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరు దారుణం. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండి. వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, ఉచిత బస్సు అంటూ పథకాలకు చరమగీతం పలికారు’ అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ మండిపడ్డారు.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Also Read: Gottipati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచబోము.. వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది!
‘రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను అణిచివేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యాంగాన్ని చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్సు కూడా ఆవేదన చెందుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల విషయంలో పోలీసులు తమనుతాము ప్రశ్నించుకోవాలి. మాజీమంత్రి విడదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రానున్న ఎన్నికలలో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!