Jakkampudi Raja: దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు.. పథకాలకు చరమగీతం పలికారు!
- దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు
- రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది
- విడదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరు దారుణం. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండి. వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, ఉచిత బస్సు అంటూ పథకాలకు చరమగీతం పలికారు’ అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ మండిపడ్డారు.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Gottipati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచబోము.. వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది!
‘రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను అణిచివేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యాంగాన్ని చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్సు కూడా ఆవేదన చెందుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల విషయంలో పోలీసులు తమనుతాము ప్రశ్నించుకోవాలి. మాజీమంత్రి విడదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రానున్న ఎన్నికలలో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!