ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై మాటల తూటాలతో దాడి చేశారు. చంద్రబాబు చేసిన మోసాలు, మార్చిన రంగులను ఎవ్వరూ మర్చిపోరన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారన్నారు. ఎన్టీరామారావు కుటుంబాన్ని మొత్తం వాడుకున్నాడు. చంద్రబాబు ఏడవడానికి ఒక వేదిక కావాలి. వంశీ చేసిన కామెంట్ ఆయన స్వంతంగా పెట్టింది కాదు. అది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉంది…
డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగ్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందన్నారు. జగన్ వన్టైం సెటిల్మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒక్కటీ చేసేదీ ఒక్కటీ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి కే ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తిగా నేరవేర్చలేదని నారాలోకేష్ అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం…
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు, గృహ రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ఆగ్రహించారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నానని…వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కొండబాబుకు…
అమరావతి : వైసీపీ నేతలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పినట్లు మేం భావించడం లేదని… చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమని మండిపడ్డారు. మాకు వంశీ సారీ కాదు.. చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. వంశీ 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని…
నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు… సెగలు రేపుతూనే ఉన్నాయి. వివాదాస్పద కామెంట్స్పై వంశీ క్షమాపణ చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమ్మ కులంలో చీడపురుగులైన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు.. అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలని అన్నారు. ఈ ముగ్గురిని భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. పరిటాల రవి బతికుంటే…ఏపీకి…
వరదలతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పొంతన లేకుండా పోతుందన్నారు. మాటి మాటికీ కేంద్రం పై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సాయం అందుతున్నప్పటికీ…
అప్పులతో ఏపీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ర్టంలో జగన్ చేసిన అప్పులతో దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అప్పులు చేయకుండా పరిపాలన చేయాలని జగన్కు సూచించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. లేఖ లో వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రాఘు రామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందని ఈ సారి లేఖలో ప్రధాన మంత్రికి తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్యారంటీ అప్పులు రూ. 1.35…
సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్ ఫెయిల్యూర్ సీఎం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జ్యోతిబా ఫూలే వంటి…