ఓటీఎస్పై ఏపీలో వేడెక్కిన రాజకీయం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు.
గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకుని వస్తుంది ప్రభుత్వం. దీని వల్ల లబ్దిదారులకు ఇంటిపై సర్వ హక్కులు వస్తాయి. కొనుగోలు, అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది.
Also Read
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
అదే విధంగా ఇంటి పై బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి సౌలభ్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఏళ్లుగా ఉన్న మొత్తం రుణం వడ్డీతో సహా మాఫీ అవుతుంది. ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద పంచాయతీల్లో రిజిస్ట్రేషన్కు ఇంటికి పదివేల రూపాయలు, మున్సిపాలిటీల్లో 15వేలు, కార్పొరేషన్లలో 20వేలు కట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ధారిత మొత్తం కంటే అప్పు తక్కువగా ఉంటే…ఆ తక్కువ మొత్తాన్నే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిపోయిన తరుణంలో వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతిపాదిస్తున్న మొత్తం కంటే రెండు, మూడింతలు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకంలో ఉన్న ప్రయోజనాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లి.. లబ్దిదారులకు అవగాహన కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తోంది అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకున్న టీడీపీ వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టకుండా ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని.. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ మొత్తం వ్యవహారం వైసీపీ తలనొప్పిగా మారింది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.ఎమ్మెల్యేల నుంచి గ్రామ సర్పంచుల వరకు అందరితో వరుసగా టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు, పథకం స్వరూపం వివరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- tdp
- ycp
తాజావార్తలు
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!