ఓటీఎస్పై ఏపీలో వేడెక్కిన రాజకీయం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు.
గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకుని వస్తుంది ప్రభుత్వం. దీని వల్ల లబ్దిదారులకు ఇంటిపై సర్వ హక్కులు వస్తాయి. కొనుగోలు, అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
అదే విధంగా ఇంటి పై బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి సౌలభ్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఏళ్లుగా ఉన్న మొత్తం రుణం వడ్డీతో సహా మాఫీ అవుతుంది. ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద పంచాయతీల్లో రిజిస్ట్రేషన్కు ఇంటికి పదివేల రూపాయలు, మున్సిపాలిటీల్లో 15వేలు, కార్పొరేషన్లలో 20వేలు కట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ధారిత మొత్తం కంటే అప్పు తక్కువగా ఉంటే…ఆ తక్కువ మొత్తాన్నే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిపోయిన తరుణంలో వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతిపాదిస్తున్న మొత్తం కంటే రెండు, మూడింతలు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకంలో ఉన్న ప్రయోజనాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లి.. లబ్దిదారులకు అవగాహన కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తోంది అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకున్న టీడీపీ వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టకుండా ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని.. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ మొత్తం వ్యవహారం వైసీపీ తలనొప్పిగా మారింది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.ఎమ్మెల్యేల నుంచి గ్రామ సర్పంచుల వరకు అందరితో వరుసగా టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు, పథకం స్వరూపం వివరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- tdp
- ycp
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..