AAP MLA Dinesh Mohaniya: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. సదరు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది.
Women Youtuber : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు, యూట్యూబర్ గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది. జాతరలో జనసందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా, కొన్ని సార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి, కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో…
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. పైగా మాల్లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ, సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తారు.
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది.
రాను రాను మానవ జీవన విధానం మారుతోంది. ఇది మనిషి జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం చూపుతోంది. ఇప్పుడు వయసులో ఉన్న చాలా మంది యువకులకు కనీసం సత్తువ తక్కువవుతోంది. మన తాతల కాలంలో ఒంటి చేస్తో 50 కేజీల వడ్ల బస్తా మోసే వాళ్లు. అలాంటి పరిస్థితి ఇప్పటి జనరేషన్ వాళ్లలో కనిపించడం లేదు. కాగా.. అయిదు పదుల వయసులు ఓ మహిళ సంచలనం సృష్టించింది.
గుంటూరులో నివాసం ఉండే షేక్ మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు గ్రామం. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది.
బీహార్లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం థ్రిల్లర్ను తలపించిన ఈ కేసును సోదరి ప్రధాన నిందితురాలిగా తేల్చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం...అన్నదమ్ముళ్లను సొదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముళ్లు, చెల్లెలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వాటాలు కుదరకపోవడంతో...చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేశారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్గా గుర్తించారు.